E-Paper
Advertisement

రూపాయి పతనం.. అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు, స్వాప్‌తో అడ్డుకట్ట

రూపాయి పతనం.. అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు, స్వాప్‌తో అడ్డుకట్ట
Advertisement

Mumbai: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఇంధన కొరతతో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ క్రమంలో డాలర్ విలువ భారీగా పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు పతనం అవుతున్నాయి. ఈ నేపత్యంలో రూపాయి విలువ అదే స్థాయిలో పడిపోతోంది. పరిస్థితి గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బై, సెల్ స్వాప్ చేపట్టాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి మే 26న ఈ-వేలం చేపట్టనుంది.

రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు

Advertisement

అంతర్జాతీయ పరిణమాల నేపథ్యంలో మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతోంది. గడిచిన నెల రోజులుగా పరిస్థితులను గమనించిన ఆర్బీఐ.. ఈ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లక్ష్యతను పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్-రూపాయి బై, సెల్ స్వాప్ వేలం నిర్వహిస్తామని తెలియజేసింది.

ఇంతకీ ఈ స్వాప్ అంటే ఏంటి? మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు బై లేదా సెల్ స్వాప్ విధానాన్ని ఫాలో అవుతుంది. దీని ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ వద్దనున్న డాలర్లను రిజర్వ్ బ్యాంక్‌కు విక్రయిస్తాయి. దానికి సమానమైన రూపాయిని పొందుతాయి.

Advertisement

మే 26న బై, సెల్ స్వాప్ వేలం

మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను నిర్దేశించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ పద్దతి వల్ల బ్యాంకుల వద్ద రూపాయి లభ్యత పెరుగుతుంది. అంతేకాదు దేశీయంగా విదేశీ మారక నిల్వలు బలోపేతం అవుతాయి. దీనివల్ల బ్యాంకింగ్ వద్ద నగదు కొరత సమస్య ఉండదు.

అంతేకాదు బాండ్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ స్వాప్ వల్ల ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. ప్రభుత్వానికి-పరిశ్రమలకు తక్కువ వడ్డీకే అప్పులు ఇవ్వవచ్చు. హెడ్జింగ్ ఖర్చులు తగ్గడం వల్ల వ్యాపారాలకు, దిగుమతులు చేసుకునే కంపెనీలకు ఊరట ఇవ్వనుంది. బై, సెల్ స్వాప్ పద్దతి ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి వీలవుతుంది.

ALSO READ: మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. బొక్కబోర్ల పడ్డ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లో విచిత్ర ఘటన!

ప్రస్తుతం రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఇది 100 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరింతగా పడిపోకుండా ఈ స్వాప్ విధానం సహాయపడుతుందని భావిస్తున్నాయి. కనీస బిడ్ సైజ్ 10 మిలియన్ డాలర్లుగా పేర్కొంది ఆర్బీఐ. మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి విలువ రూ.96.70 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×