BigTV English
Advertisement

RBI-KYC Rules: సెప్టెంబర్ 30 లోపు కెవైసి పూర్తి చేయకపోతే ఖాతా ఫ్రీజ్.. ఆర్‌బిఐ హెచ్చరిక

RBI-KYC Rules: సెప్టెంబర్ 30 లోపు కెవైసి పూర్తి చేయకపోతే ఖాతా ఫ్రీజ్.. ఆర్‌బిఐ హెచ్చరిక

RBI-KYC Rules: దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ఖాతాదారులు వెంటనే తమ కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. మనలో చాలామంది ఖాతా తెరిచిన తర్వాత, మళ్లీ ఏ పత్రాలు అవసరం అవుతాయో, ఎందుకు బ్యాంకులు కెవైసి కోరుతున్నాయో సరిగ్గా తెలియక అయోమయానికి గురవుతుంటారు. ప్రతి ఖాతాదారుడు తప్పనిసరిగా కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెబుతోంది లేకపోతే భవిష్యత్తులో ఖాతా వినియోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


కెవైసి ఎప్పటి వరకు చేసుకోవచ్చు?

ఈ కెవైసి అప్‌డేట్ ప్రక్రియ 2025 జూలై 1 నుంచే ప్రారంభమైంది. ఇది ఈనెల అంటే సెప్టెంబర్ 30, 2025 వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగనుంది. సమయం దగ్గర పడుతుండటంతో ఆర్‌బీఐ మరోసారి అలర్ట్ చేసింది. మీ గ్రామం లేదా పట్టణంలో ఉన్న బ్యాంక్ శాఖను సంప్రదించి మీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని ప్రకటించింది.


ఎందుకు కెవైసి అప్‌డేట్ అవసరం?

మన బ్యాంక్ ఖాతాలు సురక్షితంగా ఉండాలి, దొంగతనాలు జరగకుండా చూడాలి, అవినీతి లావాదేవీలు ఆగాలి, ఈ కారణాలన్నింటికీ కెవైసి అత్యంత ముఖ్యమైన రక్షణ కవచం. కస్టమర్ ఎవరన్నది స్పష్టంగా నిర్ధారించుకోవడమే కెవైసి యొక్క ప్రధాన ఉద్దేశం. ఒకసారి అప్‌డేట్ చేస్తే మీ డబ్బు భద్రతా రీతిలో ఉంటుంది.

Also Read: Jio Offer: రీ చార్జ్‌తో పాటు బోనస్‌లు.. జియో కొత్త బంపర్ ప్లాన్

అప్‌డేట్ చేయడానికి కావలసిన పత్రాలు ఇవే

* పేరు, చిరునామా ధృవీకరణకు అవసరమైన పత్రాలు

* ఆధార్ కార్డు,

* ఓటర్ ఐడి

* పాన్ కార్డు

* పాస్‌పోర్ట్

* డ్రైవింగ్ లైసెన్స్

* ఉద్యోగ హామీ పత్రాలు

* NREGA జాబ్ కార్డు, అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఇది గ్రామాల ప్రజలకు వేతనం కలిగే పనిని భరోసాగా అందిస్తుంది. ఈ పత్రాలలో ఏదో ఒకటి చూపించాలి. దీంతో బ్యాంక్ మీ ఆధార్ లేదా ఇతర ఆధార పత్రాలను నమోదు చేస్తుంది. గ్రామాల్లో ఉంటే గ్రామ పంచాయతి జారీ చేసే నివాస ధృవపత్రం కూడా ఉపయోగపడుతుంది.

ఎక్కడ అప్‌డేట్ చేయాలి?

మీరు ఖాతా తెరిచిన బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్లు కూడా ఉంటాయి. దీనివల్ల సులభంగా కెవైసి అప్‌డేట్ చేయించుకోవచ్చు.

అప్‌డేట్ చేయకపోతే ఏమవుతుంది?

రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక స్పష్టంగా చెబుతోంది. మీరు సమయానికి కెవైసి చేయకపోతే మీ ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే డబ్బు విత్‌డ్రా చేయలేరు, ఆన్‌లైన్ లావాదేవీలు ఆపేయబడతాయి. అత్యవసర సమయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే కెవైసి అప్‌డేట్ చేసుకుని మీకే మంచిది. చిన్న పని అనుకుని వాయిదా వేసుకుంటే రేపు పెద్ద కష్టం ఎదురవుతుంది. కాబట్టి మీ సమీప బ్యాంక్ శాఖలో లేదా పంచాయతి కౌంటర్‌లో 2025 సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా కెవైసి అప్‌డేట్ పూర్తి చేయండి. ఐదు నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది. కానీ దాని లాభం మాత్రం ఎంతో పెద్దది. మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Related News

Today Gold Rate: రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర.. కారణం ఇదే!

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Amazon Bumper Offer: అమెజాన్‌ భారీ ఆఫర్లు.. హోమ్‌ అవసరాల నుంచి వింటర్‌ ప్రోడక్ట్స్‌ వరకు 70శాతం తగ్గింపు

Aadhar Card New Rules: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!

Gold Rates: దుబాయ్ లోనే కాదు.. బంగారం ఈ దేశాల్లోనూ వెరీ చీప్!

JioMart Offer: రూ.199లో రూ.50 తగ్గింపా?.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కి షాక్ ఇచ్చిన జియోమార్ట్ ఆఫర్..

SIP Investment: 20 ఏళ్లు నెలకు రూ.15 వేలు పెట్టుబడి vs 15 ఏళ్లు నెలకు రూ.20 వేలు పెట్టుబడి.. ఎవరు ఎక్కువ లబ్ది పొందుతారంటే?

Silver Loan: రూటు మార్చిన ఆర్బీఐ, ఇకపై సిల్వర్‌పై కూడా, కస్టమర్లు ఫుల్ ఎంజాయ్

Big Stories

×