E-Paper
Advertisement

Hyderabad Politics: హరీష్ రావు ఇంటికి ఎమ్మెల్సీ కవిత.. ఆయన కుటుంబసభ్యులకు పరామర్శ

Hyderabad Politics: హరీష్ రావు ఇంటికి ఎమ్మెల్సీ కవిత.. ఆయన కుటుంబసభ్యులకు పరామర్శ
Advertisement

Hyderabad Politics: రాజకీయాలు వేరు.. ఫ్యామిలీ రిలేషన్స్ వేరు.. ఈ రెండింటినీ ఒకే గాడిన కట్టరాదని చాలామంది రాజకీయ నేతలు సమయం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. లేటెస్టుగా మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వచ్చారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అన్న ఒక పార్టీలో.. తమ్ముడు మరొక పార్టీలో ఉండడం చూస్తుంటాము. తెలంగాణ విషయానికి వద్దాం.. రీసెంట్‌గా మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మరణించారు. ఈ విషయం తెలియగానే వివిధ పార్టీల నేతలు ఆయనకు నివాళులు అర్పించి, తమ సానుభూతి తెలిపారు. అందులో బీఆర్ఎస్ నేతలేకాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందినవారు ఉన్నారు.

ఆ రోజు ఎమ్మెల్సీ కవిత రాలేదు. హరీష్‌రావుతో విభేదాల కారణంగానే రాలేదని చాలామంది అనుకున్నారు.  మూడు రోజుల తర్వాత గురువారం ఉదయం మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి  కుటుంబసభ్యులతో వచ్చారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు. కాసేపు ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడారు.  సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Advertisement

కుటుంబసభ్యులకు కవిత పరామర్శ

హరీష్‌రావుపై ఆరోపణలు గుప్పించిన తర్వాత కవిత ఆయన ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో హరీష్‌రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  కేసీఆర్‌కు అవినీతి మరక వెనుక హరీష్‌రావు-సంతోష్‌రావు ప్రధాన కారణమని ఆరోపించారు. వారిద్దరు అవినీతి చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  ఈ వ్యవహారం జరుగుతుండగా హరీష్‌రావు లండన్ వెళ్లారు.

ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో నేతలు బిజీ

కవితపై నేరుగా స్పందించడానికి ఆయన ఆసక్తి చూపలేదు హరీష్‌రావు. తాను ఉద్యమం నుంచి ఉన్నారని, తన ప్రస్థానం తెరిచిన పుస్తకంగా వర్ణించారు. తనను, పార్టీపై కొందరు ఆరోపణలు చేశారని, అవి ఎందుకు చేశారో తెలీదన్నారు. అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతకు మించి ఆయన ఒక్కమాట కూడా అనలేదు. హరీష్‌రావు తండ్రి మరణం తర్వాత కవిత ఆయన ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి కూడా. దీనిపై రాజకీయ పార్టీల నేతలు తలో విధంగా చర్చించుకోవడం మొదలైంది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×