E-Paper

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి
Advertisement

VIZAG: డేటా సిటీ నగరంగా రూపు దిద్దుకోనుంది విశాఖపట్నం. దీనికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గూగుల్ తన ఏఐ డేటా సెంటర్‌కు పునాది రాయి వేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ కూడా రంగంలోకి దిగేసింది. ఏకంగా కోటి 60 లక్షలతో డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఉత్తరాంధ్రకు సరైన బూస్ట్ లభించినట్లయ్యింది.

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్

Advertisement

రిలయన్స్ సంస్థ దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ సుమారు రూ. 1.6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో జోరందుకున్నాయి. 1.5 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ కూడా లక్ష కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతోంది కూడా. ఇప్పుడు ఆ జాబితాలోకి రిలయన్స్ సంస్థ కూడా చేరిపోయింది.

Advertisement

రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌.. దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సెంటర్ క్లస్టర్‌తోపాటు దానిని నిర్వహణ కోసం సోలార్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ నిర్మించనుంది రిలయన్స్. ఇప్పటికే గూగుల్ ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను నిర్మిస్తోంది. రిలయన్స్‌ డేటా సెంటర్ క్లస్టర్ దానికంటే పెద్ది. సామర్థ్యం, పెట్టుబడుల్లో గూగుల్‌ను అధిగమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడులకు గత శనివారం మీటింగ్‌లో రిలయన్స్ ఆమోదించినట్టు తెలుస్తోంది. గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 3 దశల్లో నిర్మంచనుంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం నుంచి దాదాపు 935 ఎకరాలు కోరిందని సమాచారం. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, డిశాలినేషన్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చేయనుంది.

ALSO READ: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్‌పై ఆధారపడవద్దు.. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే.. ఎందుకంటే?

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భూముల పరిశీలన మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖలో 295 ఎకరాలు గుర్చించినట్టు తెలుస్తోంది. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం శ్రీసత్యసాయి జిల్లాలో భూములు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఒకేచోట 600 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరినట్టు సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లో ఒకేచోట అందుబాటులో ఉన్న భూములను పరిశీలన చేస్తోందట ప్రభుత్వం. భూముల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత పరిశీలనకు రిలయన్స్‌ ప్రతినిధులు రానున్నారు.

Related News

స్టాక్ మార్కెట్‌ భారీ పతనం.. పేక మేడలా కూలిన ఐటీ షేర్లు, కేవలం ఫార్మా రంగం తప్పితే

దేశంలో పడిపోయిన బంగారం దిగుమతులు.. బంగారం కొనుగోలు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజులో ఎన్నివేలు పెరిగిందంటే?

లోన్లు తీసుకునేవారికి షాకింగ్.. ఆర్బీఐ కొత్త రూల్స్, అలాగయితే కష్టమే

ఇల్లు కొంటున్నారా? ఈ తప్పులు చేస్తే.. లైఫ్ లాంగ్ సంపాదన గోవిందా!

రేట్ల వెనక “9” మాయాజాలం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన షాపింగ్ సీక్రెట్

SpaceX IPO: ఐపీఓకు స్పేస్‌ ఎక్స్.. 4400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు, మరో 400 మంది అయితే..

DELHI: రెండు ప్రభుత్వ సంస్థల విలీనం.. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర, ఏంటి ఆ కంపెనీలు

Big Stories

×