E-Paper
Advertisement

Reliance: ఏపీలో రిలయన్స్ రూ.65,000 కోట్ల పెట్టుబడి..2,50,000 మందికి ఉద్యోగాలు..

Reliance: ఏపీలో రిలయన్స్ రూ.65,000 కోట్ల పెట్టుబడి..2,50,000 మందికి ఉద్యోగాలు..
Advertisement

Reliance: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి రూ. 65,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా 500 ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏకంగా 2,50,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

కనిగిరిలో తొలి ప్లాంట్‌కు శంకుస్థాపన
ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి ప్లాంట్‌ ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమైంది. ఈ ప్లాంట్‌ను రూ. 139 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నారు. దీనికి శంకుస్థాపనను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్‌ బుధవారం జరిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణహిత ఇంధనం ఉత్పత్తి జరగనుంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది.

Advertisement

రైతుల ఆదాయంలో పెరుగుదల
రిలయన్స్‌ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ కేవలం పరిశ్రమలకు పరిమితం కాకుండా, రైతులకు ఎంతో మేలు చేస్తుంది. బయోగ్యాస్‌ ఉత్పత్తి కోసం వ్యవసాయ వ్యర్థాలు, బంజరు భూముల్లో పెరిగే నేపియర్ గడ్డి (ఏనుగు గడ్డి) వంటివి ఉపయోగించనున్నారు. దీని ద్వారా రైతులకు లీజు ఆదాయం లభించడంతో పాటు, గడ్డికి స్థిర ధర నిర్ణయించనున్నారు. దీని వలన వ్యవసాయంలో కొత్త అవకాశాలు ఏర్పడి, గ్రామీణ ప్రజలకు జీవనోపాధి పెరుగుతాయి.

Read Also: Top 5 AC Deals: టాప్ 5 ఏసీలపై బెస్ట్ డీల్స్..50% తగ్గింపు …

Advertisement

2,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటన ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 500 ప్లాంట్ల ద్వారా 2,50,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపల వంటి ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. అన్ని ప్లాంట్లు పూర్తిగా అమలులోకి రాగానే, ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల గ్రీన్ CBG ఉత్పత్తి చేయనున్నారు. అలాగే, 11 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలు అందించనున్నారు.

స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలమైన అండ
ఈ ప్రాజెక్ట్‌ వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడనుంది. రైతులకు స్థిర ఆదాయం, గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు, పర్యావరణానికి హాని కలిగించని ఇంధనం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ PMS ప్రసాద్‌ మాట్లాడుతూ, “ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కాదు, గ్రామీణాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఊతమిచ్చే ప్రాజెక్ట్” అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా మద్దతు ఇస్తోంది. గ్రామీణ రైతులను, స్థానిక యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా, ఇంధన ఖర్చులను తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింతగా ప్రోత్సహిస్తోంది.

భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు
ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే, మరిన్ని పరిశ్రమలు బయోగ్యాస్‌ ఉత్పత్తికి ముందుకొచ్చే అవకాశం ఉంది. తద్వారా, రాష్ట్రంలో పర్యావరణ హిత పరిశ్రమల వృద్ధికి దోహదపడనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పచ్చదనంతో పాటు పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×