Stock Market: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వేళ బాంబే స్టాక్ మార్కెట్ భారీ ఒడుదుడుకులకు లోనైంది. ఫలితంగా ఓ వైపు బడ్జెట్ ప్రసంగం విత్త మంత్రి చదువుతుండగా మరోవైపు స్టార్ మార్కెట్లో వివిధ రంగాల షేర్లు నేలచూపు చూశాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయ్యేనాటికి బీఎస్ఈ 1700 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 350 పాయింట్లు పైగా నష్టపోయింది.
నిర్మల బడ్జెట్ వేళ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
ముఖ్యంగా బడ్జెట్లో కంపెనీల బై బ్యాక్పై పన్ను విధించడంతోపాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం వల్ల ఈ విధంగా జరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 12 గంటల నుంచి మెల్లగా మెల్లగా పతనమైన స్టాక్ మార్కెట్ ఒకానొక దశలో 2300 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా 550 పాయింట్లు పైగానే కోల్పోయింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నేలచూపు చూశాయి.
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ అనేది స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు, విక్రయాల మీద విధించే ప్రత్యక్ష పన్ను. లావాదేవీల సమయంలో ప్రభుత్వం ఈ మొత్తాన్ని వసూలు చేస్తుంది. మార్కెట్ లావాదేవీల్లో పారదర్శకత, పన్ను వసూలు ప్రక్రియను సులభతరం చేయడంపై ఫోకస్ చేసింది. పెట్టుబడుల లావాదేవీలను అధికారిక పన్ను పరిధిలోకి రావడానికి ఉపయోగం.
ఆదిలో 2300 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ
పన్ను పెంపు వల్ల ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ల లావాదేవీల ఖర్చు అమాంతంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. దీని ప్రభావం లిక్విడిటీపై పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో చిన్నస్థాయి పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మెల్లగా కోరుకున్నట్లు కనిపించింది.
ఇన్వెస్టర్లకు గానీ క్యాపిటల్ మార్కెట్ కోసం ఎలాంటి ప్రొత్సాహకాలు లేకపోవడం దీని ప్రధాన కారణంగా చెబుతున్నారు నిఫుణులు. ఎంసీఎక్స్ స్టాక్స్ తోపాటు మిగతా రంగాల షేర్లు పతనమమయ్యాయి. ఏడాది తొలి నెలలో ఎఫ్ఐఐ నెట్ సెల్లింగ్ జరిగిందని, దాన్ని కౌంటర్ చేయడానికి మెన్షన్ చేయలేకపోవడం కారణంగా చెబుతున్నారు.
ALSO READ: హైదరాబాద్కు హైస్పీడ్ వరం.. మూడు భారీ కారిడార్ల ప్రకటన!
గడిచిన ఏడాదిగా మార్కెట్ పతనం అవుతోందని, ఆ విషయంలో దిద్దుబాటు చర్యలు లేవని చెబుతున్నారు. జాతీయ స్థాయి మధుపరులకు కాకపోతే ఫారెన్ ఇన్వెస్టర్లకు తగ్గిస్తే బాగుండేదని చెబుతున్నారు. ఓ వైపు రుపీ పతనం ఇవన్నీ కలిసి మార్కెట్ ని నష్టాల వైపు నడిపించిందని అంటున్నారు.