BigTV English
Advertisement

Dangerous App’s: అలర్ట్.. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉందా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి.. ప్రభుత్వం హెచ్చరిక!

Dangerous App’s: అలర్ట్.. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉందా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి.. ప్రభుత్వం హెచ్చరిక!

Indian Government Warned to Android & IOS Users Regarding this App: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సైబర్ నేరగాళ్లు తరచూ డబ్బు కొట్టేయాలనే పనిలోనే ఉంటున్నారు. సామాన్యులు, ప్రముఖులు అని తేడా లేకుండా ఒక్క మెసెజ్ క్లిక్‌తో వారి ఖాతాలోని డబ్బును ఈజీగా లూటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి.


గత ఏడాది చివర్లో ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం (PIB ఫాక్ట్ చెక్) నకిలీ SMS స్కామ్ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులందరినీ హెచ్చరించిన విషయం తెలిసిందే. మీరు SMSలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ పాన్ కార్డ్‌ని అప్‌డేట్ చేయకపోతే, మీ SBI YONO ఖాతా బ్లాక్ చేయబడుతుందని గతంలో ఓ మెసెజ్ వచ్చింది.

అయితే ఈ SMS SBI బ్యాంక్ ద్వారా పంపబడినట్లు చాలామంది అనుకున్నారు. కానీ అది SBI బ్యాంక్ నుంచి రాలేదని.. అది నకిలీ మెసెజ్ అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఫోన్లలో ప్రమాదరకమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్లనే ఇలాంటి మెసెజ్‌లు వస్తాయని భారత ప్రభుత్వం హెచ్చరించింది.


Also Read: ఈ పది నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లు ఎత్తారా.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీనే!

అయితే మరోసారి భారత ప్రభుత్వం ప్రమాదకరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలించే యాప్‌లు ఉన్నాయని.. ఈ యాప్‌ల గురించిన సమాచారం భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ అవగాహన ప్లాట్‌ఫామ్ ‘సైబర్ దోస్త్’లో అందించబడిందని తెలిపింది.

ఈ మేరకు ‘సైబర్ దోస్త్’ ట్వీట్ చేసింది. అందులో యూనియన్ బ్యాంక్‌కి సంబంధించిన నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఈ నకిలీ యాప్ పేరు ‘Union-Rewards.apk.’ అని తెలిపింది. ఈ యాప్ నిజమైన యూనియన్ బ్యాంక్ యాప్‌లా ఉంటుంది.

Also Read: Smriti Irani comment: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?

ఈ యాప్ బహుమతులు ఇచ్చేలా ప్రజలను మోసగిస్తుందని తెలిపింది. భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఖాతా అయిన సైబర్‌డోస్త్ ఫేక్ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలను హెచ్చరించింది. అంతేకాకుండా ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు ప్రజలను ఎక్కువగా మోసం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు లక్షల రూపాయల మేర నష్టపోయారు. అటువంటి ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ‘గ్రూప్-ఎస్’ గురించి భారత ప్రభుత్వ సైబర్ సెల్ ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ఈ యాప్ మీ డబ్బును లూటీ చేస్తుందని హెచ్చరించింది.

Tags

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×