BigTV English
Advertisement

Kaveri Travels Bus Accident: బస్సు ప్రమాదం పాపం ఎవరిది? స్పాట్‌లో 50 మంది

Kaveri Travels Bus Accident: బస్సు ప్రమాదం పాపం ఎవరిది? స్పాట్‌లో 50 మంది

Kaveri Travels Bus Accident: రాజమండ్రి సమీపంలో అర్థరాత్రి ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా, 18 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంతకీ ప్రమాదం వెనుక అసలేం జరిగంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


విశాఖ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్ కి చెందిన బస్సు బయలుదేరింది. విశాఖలో రాత్రి బయలుదేరిన ఈ బస్సు, అర్థరాత్రి అయ్యేసరికి రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురైంది. రాజమండ్రి రూరల్ కాతేరు-కొంతమూరు మధ్య బస్సు బోల్తా పడింది. ఆ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. వేగంగా వెళ్తున్న బస్సుకు ఒక్కసారి బోర్డు కనిపించింది. వెంటనే దాన్ని టర్న్ చేసే క్రమంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువతి స్పాట్‌లో మృతి చెందింది. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ వైపు అంబులెన్స్, మరోవైపు క్రేన్ వచ్చింది. రోడ్డుపైనున్న బస్సును క్రేన్‌తో పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

ALSO READ: చంపిన తర్వాత శవాన్ని కుక్కర్లో ఎందుకు ఉడికించాడు.. ఆనవాళ్లు లేకుండా ఏం చేశాడు?

గాయపడిన వారిలో కొందర్ని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించారు. మృతి చెందిన యువతి విశాఖకు చెందినదిగా గుర్తించారు. టెక్కీ కంపెనీలో జాబ్ కోసం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అంతలోనే యువతి ఈ లోకాన్ని విడిచిపెట్టింది.

 

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×