BigTV English

Ananthapur Robbery : అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. రూ.కోట్లు విలువైన బంగారం, నగదు దోపిడీ

Ananthapur Robbery : అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. రూ.కోట్లు విలువైన బంగారం, నగదు దోపిడీ

Ananthapur Real Estate Businessmen Robbery | అనంతపురంలోని సవేరా హాస్పిటల్ సమీపంలోని రాజహంసా విల్లాస్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.


శివారెడ్డి ఇంట్లో దాచి ఉంచిన 3.50 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, 25 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. వీటిని ఫిబ్రవరి 7న తన కూతురు వివాహం కోసం దాచి ఉంచినట్లు శివారెడ్డి తెలిపారు. దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మొత్తం మూడు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయని సమాచారం. పొరుగునే ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇళ్లలోనూ దోపిడీ జరిగింది.

ఓ ఇంట్లో దొరక్కపోవడంతో దుండగులు వెనక్కి వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు.


చోరీ ఘటనపై బిజినెస్‌మెన్ శివారెడ్డి మాట్లాడుతూ, “నా కూతురి పెళ్లి కోసం ఉంచిన బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. మా ఇంటితో పాటు పక్కింటిలో కూడా దొంగతనం జరిగిందని సెక్యూరిటీ ద్వారా సమాచారం అందింది. కూతురి వివాహం కోసం పెళ్లి పత్రికలు ఆహ్వానం ఇచ్చేందుకు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్‌, రాయచోటిలోనూ సంక్రాంతి దోపిడీలు
ఇలాంటి చోరీలు వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సమయంలోనూ జరిగాయి. ఎనుమాముల, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుసగా దోపిడీలు జరిగాయి. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లిన ఇంటి యజమానుల గైర్హాజరీని దుండగులు టార్గెట్ చేశారు. కట్టర్లతో ఇంటి తాళాలు పగలగొట్టి.. బంగారు, నగదు దోచుకెళ్లారు.

కడప సమీపంలోని రాయచోటిలో అయితే దొంగలు నాలుగు ఇళ్లలో భారీగా దోచుకున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్‌ స్వగృహ కాలనీలో నాలుగు ఇళ్లను టార్గెట్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లిన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, రిటైర్డ్ టీచర్ రహమత్‌బీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇర్షాద్ నివాసాల్లో చోరీలు జరిగాయి. జనవరి 14 మంగళవారం రాత్రి దొంగలు ఇళ్లలోకి చొరబడి.. మొత్తం ఐదు తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 20 వేల నగదు దోచుకెళ్లారు.

బుధవారం మధ్యాహ్నం ఇళ్లకు వచ్చిన యజమానులు ఇంట్లోదొంగతనం జరిగిందని తెలిసి షాకయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంతవరకూ విచారణ కొనసాగుతూనే ఉంది. పండుగ సీజన్‌లో ఇలాంటి చోరీలు వరుసగా జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు

దొంగతనాలను నివారించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి
దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాళాలు కనపడకుండా వేయాలి.
సమీప బంధువుల్ని ఇంటి దగ్గర ఉండేలా చూడాలి.
విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలి.
రాత్రిపూట ఇంట్లో లైట్లు వెలిగేలా చూడాలి.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నోటిఫికేషన్లు పొందడం మంచిది.
అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి.

 

Related News

Khammam News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వాహనం, షాకింగ్ దృశ్యాలు

Guntur Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

Raipur Crime News: టీనేజీ యువతి ఒత్తిడి.. మొండి కేసిన ప్రియుడు, గొంతు కోసి చంపేసింది

Chittoor News: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పేరెంట్స్ మందలింపు, యువతి సూసైడ్

Indrakeeladri Stampede: ఇంద్రకీలాద్రిపై భ‌క్తుల ర‌ద్దీ.. క్యూలైన్ల‌లో తోపులాట

Rowdy Sheeter: కత్తితో రౌడీ షీటర్ వీరంగం.. పరిగెత్తించి.. పరిగెత్తించి

Big Stories

×