E-Paper
Advertisement

Saudi Arabia Bus Incident: ‘మా కుటుంబం నుంచి 18 మంది వెళ్లారు.. బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు’

Saudi Arabia Bus Incident: ‘మా కుటుంబం నుంచి 18 మంది వెళ్లారు.. బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు’
Advertisement

Saudi Arabia Bus Incident: నేడు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చాల విషాదకర చాయలు అలుముకున్నాయి. అయితే బస్సు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. అయితే ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్‌హరామ్‌లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా డిజిటల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్‌లో 42 మంది మృతి చెందారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.

అయితే ఇందులో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.. వీరంతా పడుకొని ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అందరు సజీవదహనం అయిపోయారు. అంతేకాకుండా ఆసిఫ్‌నగర్, గోషామహల్ నుంచి 16 మంది చనిపోయారని తెలిపారు. ముఖ్యంగా ఆ యాత్రికుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చనిపోవడం తీవ్ర విషాదం.. ఆ కుటుంబం నుంచి 9 మంది వెళ్లగా ఒకరు మాత్రమే బయటపడ్డాడు.. ఈ ఘటనలో షోయబ్ ఒక్కడు మాత్రమే గాయాలతో బయట పడిపోయాడు.. మిగతా వారంతా సజీవదహనం అయ్యారు.

Advertisement

Also Read: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంతుందంటే..?

అయితే నవంబర్ 9న ట్రావెల్స్ నుంచి 20 మంది బయలుదేరారు. అలాగే ఫ్లై జోన్ నుండి మరో 24 మంది వెళ్లారు. మొత్తం 44 మంది మక్కా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మదీనాకు వెళ్తుండగా.. ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ ఆఫీస్ నుండి వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుని వెళ్లారు. ప్రస్తుతం మృతుల డీటైల్స్ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఎవరు చనిపోయారు ఎవరు బ్రతుకున్నారు అనేది ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని ఫ్లైజోన్ ట్రావెల్స్ ఏజెంట్ తెలిపాడు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×