E-Paper
Advertisement

MP Crime: ఛీ.. ఛీ.. వాడొక కామాంధుడు.. ఆ వీడియో ఎంత పని చేసింది, ఆపై విధ్వంసం

MP Crime: ఛీ.. ఛీ.. వాడొక కామాంధుడు.. ఆ వీడియో ఎంత పని చేసింది, ఆపై విధ్వంసం
Advertisement

MP Crime: చిన్న వీడియో వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులు, వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? ఆవుపై ఓ వ్యక్తి అసహజ చర్యకు పాల్పడినట్టు వీడియో క్లిప్ వైరల్ కావడం ఇందుకు కారణమైంది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

మధ్య‌ప్రదేశ్‌లో దారుణం.. ఆవుపై అసహజ చర్య

Advertisement

మధ్యప్రదేశ్‌ బేతుల్ జిల్లాలోని దమ్జీపుర గ్రామంలో ఓ వ్యక్తి.. ఆవుపై అత్యాచారం చేసినట్టు వీడియో కలకలం రేపింది. ఈ వీడియో చూసిన స్థానికులు రెచ్చిపోయారు. తొలుత ఆందోళన చేపట్టారు.. అది కాస్త ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో స్థానికులు దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేసి తగులబెట్టారు. చివరకు ఆ కామాంధుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.

ఈ ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల గురించి తెలియగానే పోలీసులు రంగం ప్రవేశం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ అల్లర్లు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 200 మంది పోలీసులు ఆ గ్రామంలో మోహరించారు. అంతేకాదు సమీపంలోని ఖాండ్వా నుండి బలగాలను రప్పించారు బేతుల్ ఎస్పీ.

Advertisement

రెచ్చిపోయిన స్థానికులు.. షాపులు ధ్వంసం

వైరల్ క్లిప్‌ గురించి ఆయన మాట్లాడారు. దాదాపు 50 ఏళ్ల ఓ వ్యక్తి.. ఆవుతో అసహజ చర్యకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆ వీడియో బయటపడిన తర్వాత పోలీసులు చర్యలు చేపట్టారని, నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో షాపులు, మార్కెట్ వేశారు.

శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే ఆ వీడియోను చిత్రీకరించిన స్థానిక యువకుడు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఆదివారం ఆ వీడియో షేర్ చేశాడు. స్థానికులు ఆందోళనలో ప్రాణ నష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.

ALSO READ: ధూల్‌పేటలో గంజాయి దందా గుట్టురట్టు.. ఎక్సయిజ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్!

దాదాపు 10 దుకాణాలు అల్లరి మూక ధ్వంసం చేసింది. ఈ విషయంలో స్థానికులు ప్రశాంతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. శాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×