Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. నగరంలోని ముషీరాబాద్, బాపూజీ నగర్లో 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని పవిత్ర దారుణ హత్యకు గురైంది. సమీప బంధువు ఉమాశంకర్ కత్తితో ఆమె గొంతు కోసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ, పెళ్లి పేరుతో కొన్ని రోజులుగా ఉమాశంకర్ పవిత్రను వేధిస్తున్నాడు. అయితే, అతను తాగుబోతు కావటంతో పవిత్ర పెళ్లిని నిరాకరించింది. దీనితో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పవిత్ర తల్లిదండ్రులు ఆరోపించారు.
హత్యకు సంబంధించిన వివరాలను పవిత్ర మేనత్త వెల్లడించారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉమాశంకర్ వచ్చి, మాట్లాడుకుందామని చెప్పాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర మెడ, ఛాతీపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడని తెలిపారు. ఉమాశంకర్ తల్లిదండ్రులు చనిపోతే తమ అన్న, వదినే అతడిని చేరదీశారు. అయినా, విశ్వాసం లేకుండా ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఉమాశంకర్ తన కుటుంబంలోని ఎవరితోనూ పవిత్ర మాట్లాడకుండా అడ్డుకున్నాడు.
పెళ్లి కాకముందే ఇంతలా వేధిస్తున్నావు.. పెళ్లయితే ఇంకెలా ఉంటావని పవిత్ర ప్రశ్నించినందుకే ఆమెను చంపేశాడని మేనత్త వివరించారు. ఈ మేరకు వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ALSO READ: Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్