Alwal Case: స్వేచ్ఛ బ్యూరో: మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నేరస్తుడికి న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు 5వేల జరిమాన విధించారు.
వివరాల్లోకి వెళ్లితే… అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే వీర వెంకట ప్రసాద్ ఆటో డ్రైవర్ (23)గా వృతి నిర్వహిస్తున్నాడు. అతడికి మైనర్ బాలికతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె మాయమాటలతో లొంగదీసుకొని, నగరంలో నుంచి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు గత ఏడాది జనవరి 27న అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. సీఐ రాహుల్దేవ్ కేసు దర్యాప్తు చేయగా ఏసీపీ రాములు చార్జీషీటు దాఖలు చేశారు. కేసును పలుమార్లు న్యాయమూర్తి విచారించారు. చివరగా శుక్రవారం తుది విచారణకు వచ్చింది.
వీర ప్రసాద్ పై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకటేశ్ 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాలిలకు రూ. లక్ష పరిహార ఇవ్వాలని వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు పక్కాగా సాక్ష్యాదారులు సేకరించి, చార్జీషీటు దాఖల చేయగా, ఏపీపీ ప్రభాకర్ రెడ్డి నిందితుడి శిక్ష పడేలా వాదించారు. దీంతో అతి తక్కువ కాలంలో నిందితుడిపై మోపిన అభియోగం రుజువై, శిక్ష పడింది.
Also Read: క్రికెట్ పిచ్పై మల్లారెడ్డి మాస్ బ్యాటింగ్.. మేడ్చల్లో సీఎంఆర్ స్కూల్స్ షురూ!