E-Paper
Advertisement

Anantapur Incident: తాడిపత్రిలో ఘోరం.. అనుమానంతో భార్యను అతి కిరాతంగా చంపి, ఆ తర్వాత..

Anantapur Incident: తాడిపత్రిలో ఘోరం.. అనుమానంతో భార్యను అతి కిరాతంగా చంపి, ఆ తర్వాత..
Advertisement

Anantapur Incident: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఎల్లనూరు రోడ్డులో ఒక ఉన్మాద ఘటన వెలుగుచూసింది. నంద్యాల జిల్లా నల్లమేకలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి, వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తన భార్య శ్రీలేఖతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుధాకర్, ఆమెను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

అయితే హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, సుధాకర్ తన లారీలోనే భార్య మృతదేహాన్ని ఎక్కించుకుని ఊరి వెలుపలికి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతమైన ముచ్చుకోట అటవీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత, అక్కడ ఎవరూ లేని సమయం చూసి శ్రీలేఖ శవాన్ని పొదల్లో పడేశాడు. భార్యను మట్టుబెట్టిన తర్వాత ఏమీ తెలియనట్టు తప్పించుకోవాలని చూసినప్పటికీ, చివరికి నేర అంగీకారంతో పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

నేరం చేసిన తర్వాత కలిగిన భయమో లేదా పశ్చాత్తాపమో తెలియదు కానీ, సుధాకర్ నేరుగా పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేశానని, మృతదేహాన్ని అడవిలో పడేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు, తక్షణమే ముచ్చుకోట అటవీ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు.

Also Read: రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు

Advertisement

పోలీసులు అడవిలో గాలించగా శ్రీలేఖ శవం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు, అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×