BigTV English
Advertisement

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

YSRCP Activist Death: అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన వైసీపీ కార్యకర్త.. దేవన సతీశ్ రెడ్డి (33) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువకుడు ఇటీవలే వైసీపీ రూరల్ బూత్ కన్వీనర్గా నియమితులయ్యారు.


ఘటన వివరాలు

స్థానికుల సమాచారం ప్రకారం, బుధవారం రాత్రి పామిడి నుంచి తన గ్రామం కొట్టాల వెళ్తున్న సమయంలో.. కాలాపురం గ్రామ సమీపంలో సతీశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. మొదట దాన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించినా, ఆయన శరీరంపై రక్తపు గాయాలు, కొంత అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో.. గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


హత్యా? ప్రమాదమా?

సతీశ్ మృతి వెనుక రెండు కోణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదమా లేక హత్యా అన్న కోణంలో అనుమానిస్తున్నారు.

సతీశ్ ఇటీవలే బూత్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఆయనకు స్థానికంగా సపోర్ట్ పెరగడంతో పాటు.. కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మృతి వెనుక వ్యక్తిగత వైరం, రాజకీయంగా లేదా యాదృచ్ఛిక ప్రమాదమా అన్నది దర్యాప్తుతో తేలాల్సి ఉంది.

కుటుంబ సభ్యుల ఆవేదన

మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కచ్చితంగా ప్రమాదం కాదు ఎవరో హత్య చేసిందే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నాయకులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

వైసీపీకి చెందిన ఒక చురుకైన కార్యకర్త ఇలా అనుమానాస్పదంగా.. మృతి చెందడం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా, ఇటీవల పార్టీ అంతర్గత విభేదాలు, వర్గపోరులు కూడా కొన్నిచోట్ల కనిపించడం వల్ల ఈ మృతి చుట్టూ మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు అసలు కారణం ఏంటన్నది చెప్పడం కష్టం.

పోలీసుల దర్యాప్తు

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహాన్ని, బైక్‌ను పరిశీలిస్తున్నారు. కాలాపురం గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి వెనుక నిజమైన కారణం స్పష్టత రానుంది.

Also Read: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

అతనంపురం జిల్లా పామిడి మండలం వైసీపీ కార్యకర్త సతీశ్ రెడ్డి మృతి మిస్టరీగా మారింది. ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదమా? లేకపోతే హత్యా? అన్నది దర్యాప్తులో తేలనుంది.

Related News

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Big Stories

×