E-Paper
Advertisement

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి
Cyber Crimes: రాష్ట్రంలో సైబర్ నేరాలు తీవ్రమైన సామాజిక సమస్యగా మారాయని, దీనిని కేవలం అవగాహన కార్యక్రమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా (మూవ్‌మెంట్‌) తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరస్థులు కేవలం ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఇంటరాక్షన్ ద్వారానే సులభంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాత నేరస్థుల తరహాలోనే, కొత్త సైబర్ నేరగాళ్లు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని హెచ్చరించారు.నేరగాళ్లు తమ లక్ష్యాలను చాలా వ్యూహాత్మకంగా ఎంచుకుంటున్నారని డీజీపీ వివరించారు. ఎవరు ధనవంతులు, ఏ లొకేషన్‌లో ఉంటారు, వారి వయస్సు, లింగం వంటి పూర్తి వివరాలను తెలుసుకుని దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు, గృహిణులే వారి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. “వంట చేస్తున్న సమయంలో లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసి, భయపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది” అని ఆయన అన్నారు.

Read Also: Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

ఈ సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రజల అవగాహనే అత్యంత పెద్ద అడ్డంకి అని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. “హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉండటం ఆందోళనకరం. అందుకే యువకులు, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ ఈ అవగాహన ఉద్యమంలో భాగం కావాలి. ఒకరు పది మందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్‌మెంట్ అవుతుంది” అని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ చేస్తోందని, మోసాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. “నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ప్రజల్లో అవగాహన మరింత పెరగాలి. ప్రజలే సైబర్ నేరాలపై ప్రవక్తగా (అవగాహన దూతగా) ఉండాలి. నగరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం” అని ఆయన తెలిపారు.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×