BigTV English
Advertisement

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి
Cyber Crimes: రాష్ట్రంలో సైబర్ నేరాలు తీవ్రమైన సామాజిక సమస్యగా మారాయని, దీనిని కేవలం అవగాహన కార్యక్రమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా (మూవ్‌మెంట్‌) తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరస్థులు కేవలం ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఇంటరాక్షన్ ద్వారానే సులభంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాత నేరస్థుల తరహాలోనే, కొత్త సైబర్ నేరగాళ్లు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని హెచ్చరించారు.నేరగాళ్లు తమ లక్ష్యాలను చాలా వ్యూహాత్మకంగా ఎంచుకుంటున్నారని డీజీపీ వివరించారు. ఎవరు ధనవంతులు, ఏ లొకేషన్‌లో ఉంటారు, వారి వయస్సు, లింగం వంటి పూర్తి వివరాలను తెలుసుకుని దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు, గృహిణులే వారి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. “వంట చేస్తున్న సమయంలో లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసి, భయపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది” అని ఆయన అన్నారు.


Read Also: Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

ఈ సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రజల అవగాహనే అత్యంత పెద్ద అడ్డంకి అని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. “హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉండటం ఆందోళనకరం. అందుకే యువకులు, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ ఈ అవగాహన ఉద్యమంలో భాగం కావాలి. ఒకరు పది మందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్‌మెంట్ అవుతుంది” అని ఆయన పిలుపునిచ్చారు.


తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ చేస్తోందని, మోసాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. “నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ప్రజల్లో అవగాహన మరింత పెరగాలి. ప్రజలే సైబర్ నేరాలపై ప్రవక్తగా (అవగాహన దూతగా) ఉండాలి. నగరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం” అని ఆయన తెలిపారు.

 

Related News

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×