OTT Movie : రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కాంట్రవర్సీ సినిమా ‘ది బెంగాల్ ఫైల్స్’. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యాక సంచలనం క్రియేట్ చేసింది. బెంగాల్ విభజన నాటి హిందువుల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాలు రన్ టైమ్ తో ఈ స్టోరీ నడుస్తుంది. అయితే చరిత్రను వక్రీకరించారనే కారణంతో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేక పోయింది. ఈ మూవీ థియేటర్లో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ది బెంగాల్ ఫైల్స్’ (The Bengal files) ఈ సినిమా 2025న సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. జీ5లో నవంబర్ 21న ప్రీమియర్ కానుందని, జీ5 ఓటీటీ అనౌన్స్ మెంట్ చేసింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పై అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను 50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తే 6 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికే ది టష్కెంట్ ఫైల్స్ (2019), ది కశ్మీర్ ఫైల్స్ (2022) సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Read Also : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
1946 బెంగాల్లో జరిగిన రియల్ హిస్టారికల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ లీడర్ జిన్నా పాకిస్తాన్ కోసం హిందువుల మీద దాడులు స్టార్ట్ చేయమని చెప్తాడు. కలకత్తాలో మాస్ కిల్లింగ్స్ స్టార్ట్ అవుతాయి. ముస్లింలు హిందూ ఇళ్ల మీద దాడి చేసి, మగాళ్లని కాల్చి చంపేస్తారు. మహిళలపై అఘాయిత్యాలు చేస్తారు. ఈ ఘటనలో లక్షల మంది హిందువులు చనిపోతారు. ఈ కథ ఒక ఫ్యామిలీని ఫాలో అవుతూ వాళ్లు ఎలా టార్చర్ అవుతారో డిటెయిల్గా ఉంటుంది. హిందువులు రక్షణ లేకుండా పారిపోతారు, బ్రిటిష్ పోలీస్ లు సైలెంట్గా చూస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ దీనికి నిరసనగా, నిరాహార ధీక్ష కూడా చేస్తాడు. కానీ సిచువేషన్ కంట్రోల్ కాదు. మహిళలపై చెప్పుకోలేని దారుణాలు జరుగుతాయి. కథ జెంట్ టైమ్కి కట్ అవుతుంది. అప్పుడు బతికిన వాళ్ళు ఇంకా హిస్టరీ రీరైట్ చేయమని ఫైట్ చేస్తారు. చివరికి మెసేజ్ బెంగాల్ నెక్స్ట్ కశ్మీర్ లాగా అవుతుందని వార్నింగ్ ఇస్తారు. ఈ సినిమాలో హిందూ వాదాన్ని గట్టిగా వినిపించారు.