E-Paper
Advertisement

YSRCP ZPTC Murder: మన్యంలో ZPTC దారుణ హత్య.. గిరిజనులు కొట్టి చంపేశారు

YSRCP ZPTC Murder: మన్యంలో ZPTC దారుణ హత్య.. గిరిజనులు కొట్టి చంపేశారు
Advertisement

YSRCP ZPTC Murder: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వైసీపీ జెడ్పీటీసీ నూకరాజును గుర్తుతెలియని దుండగులు అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోలుగుంట మండలం ఛటర్జీపురంలో ఉన్న భూమి వివాదం.. ఈ హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ భూమి నూకరాజు పేరుపై ఉండగా, ఆ ప్రాంతంలోని కొందరు గిరిజనులు ఆ భూమిని తమ సొంతం అంటూ పలుమార్లు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం రక్తపాతం వరకు దారితీసింది.

Advertisement

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకరాజుకు సుమారు 10 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జడ్పిటీసి నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also Read: కానిస్టేబుల్‌ని చంపిన‌ రియాజ్ ఖ‌తం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చటర్జీపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూమి వివాదం కోణంలోపాటు, రాజకీయ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×