E-Paper
Advertisement

విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!

విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!

Visakhapatnam: విశాఖపట్నంలోని బి స్క్వేర్ హోటల్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితులే కాలయముళ్లలా మారతారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. సరదాగా గడుపుదాం, పార్టీ చేసుకుందాం అని పిలిచి.. ప్రాణ స్నేహితురాలిని అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది.

శాంతి కుమారి అనే యువతి రాత్రి 9 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లింది. అక్కడ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో చిన్నపాటి ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. ఆ గొడవ కాస్తా ముదిరి, ఆగ్రహానికి గురైన స్నేహితులు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే, చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిందని, అందుకే చనిపోయిందని నమ్మబలికే ప్రయత్నం చేశారు.

కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. అది సహజ మరణం కాదని, కొట్టి చంపారని నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు యువకులు, ఒక యువతిని నిందితులుగా గుర్తించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారని అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. పార్టీ పేరుతో ప్రాణాలు తీసిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read:  అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×