E-Paper
Advertisement

Balapur Murder: హైదరాబాద్‌లో దారుణం.. అమ్మాయితో ప్రేమ వ్యవహారం, కత్తులతో కిరాతకంగా పొడిచి..?

Balapur Murder: హైదరాబాద్‌లో దారుణం.. అమ్మాయితో ప్రేమ వ్యవహారం, కత్తులతో కిరాతకంగా  పొడిచి..?

Balapur Murder: స్నేహానికి వెన్నుపోటు పొడిచారో ఇద్దరు యువకులు. ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన మిత్రుడినే అంతమొందించాలని కుట్ర పన్నారు. ప్రేమ వ్యవహారం చిచ్చు పెట్టడంతో..  కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

హైదరాబాద్‌ వట్టెపల్లి ప్రాంతానికి చెందిన రిహాన్, శానవాజ్, మోహిజ్ ముగ్గురు స్నేహితులు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురూ కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో..  సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో బాలాపూర్‌లోని ఎర్రకుంట వద్దకు చేరుకోగానే అసలు రంగు బయటపెట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం..  అమ్మాయితో ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎర్రకుంట వద్ద నిందితులు రిహాన్‌తో గొడవకు దిగారు. మాట మాట పెరగడంతో ముందే పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తులతో శానవాజ్, మోహిజ్ ఒక్కసారిగా రిహాన్‌పై విరుచుకుపడ్డారు. శరీరంపై పలుచోట్ల విచక్షణారహితంగా పొడవడంతో రిహాన్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన రిహాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. చిన్న వయసులోనే యువకులు ఇలాంటి దారుణాలకు పాల్పడటం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×