Husband Slit His Wife: చిన్నచిన్న సమస్యలు భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంటాయి. అవి ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతాయో చెప్పలేము. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య కోరిక తీర్చ లేకపోయాడు భర్త. చివరకు ఆమెని గొంతు కోసి చంపేసి, హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్య ప్రదేశ్లో వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన.. భార్య కోరికకు భర్త షాక్
మధ్యప్రదేశ్లోని చోలా గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంచన్ సాహు-హేమరాజ్ సాహులకు 14 నెలల కిందట వివాహం జరిగింది. వీరిద్దరు గతంలో పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ ఇది సెకండ్ వివాహం. హేమరాజ్ కూరగాయల బండిని నడుపుతూ వ్యాపారం చేస్తుంటాడు.
కాంచనతో తన గ్రామంలో తల్లిదండ్రుల వద్ద నివాసం ఉండాలనేది హేమరాజ్ బలమైన కోరిక. కాంచనకు మాత్రం సిటీలో నివాసం ఉండాలనే కోరిక బలంగా ఉంది. ఈ విషయాన్ని భర్త హేమ్రాజ్కి చెప్పింది. భార్య కోరిక విని ఒక్కసారిగా షాకయ్యాడు. తన ఆలోచన ఒకలా.. భార్య ఆలోచన మరోలా ఉందని భావించాడు.
ఆ రాత్రి ఏం చేశాడంటే.. ఆ తర్వాత బంధువులకు ఫోన్
ఈ విషయంలో భార్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. వ్యాపారం చేసి ఇంటికి వస్తే..సిటీకి ఎప్పుడు వెళ్తున్నామంటూ ఒకటే నస పెట్టేది భార్య. పెళ్లి జరిగిన 14 నెలల్లో ఒక్కరోజు హేమరాజ్ ప్రశాంతంగా ఉన్న సందర్భం లేదు. కాంచన ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది.
రెండురోజుల కిందట ఇదే విషయమై హేమరాజ్-కాంచన మధ్య గొడవ జరిగింది. పట్టరాని కోపంతో భర్త.. నోట్లో గుడ్డని కుక్కేసి ఆ తర్వాత పదునైన కత్తితో ఆమె గొంతు కోశారు. అక్కడికక్కడే ఆమె మరణించింది. భార్యకి తెలివి వస్తుందని భావించిన హేమరాజ్, మరొక గదిలోకి వెళ్లి ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు.
ALSO READ: భర్తను అర్ధరాత్రి చంపిన భార్య.. ఆ రాత్రంతా అ..వీడియోలు చూస్తూ
మరుసటి రోజు కాంచన నిద్ర లేవకపోవడంతో అత్తింటికి ఫోన్ చేశాడు. జరిగిన ఘటన గురించి చెప్పాడు. కాంచన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ గ్రామానికి వచ్చి హేమరాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. నివేదిక వచ్చిన తర్వాత అధికారికంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.