Bihar Road Accident: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై రక్తం చుక్క ఆరకముందే మరో ప్రమాదం పొంచి ఉందన్న చేదు నిజం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. కటిహార్ జిల్లా కోడా బ్లాక్ పరిధిలోని NH-31 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
అతి వేగమో లేదా అజాగ్రత్తే తెలియదు కానీ.. ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా మృత్యువు విరుచుకుపడింది. బస్సు, పికప్ వ్యాన్ మ,ట్రక్కు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది. ఈ భీకర ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా పూర్నియా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పొట్టకూటి కోసం వెళ్తున్నారో లేక ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నారో కానీ, గమ్యం చేరకుండానే ఇలా మధ్యలోనే తనువు చాలించడం అత్యంత బాధాకరం.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని ప్రకటించింది.
Also Read: వేలిముద్రల మిస్టరీ.. ప్రపంచంలో ఏ ఇద్దరివి ఒకేలా ఎందుకు ఉండవు?
బీహార్లో ఘోర బస్సు ప్రమాదం
బస్సు, పికప్ వ్యాన్, ట్రక్కు ఒకదానికొకటి ఢీ
ఈ ఘటనలో 13 మంది మృతి.. 30 మందికి పైగా గాయాలు
కటిహర్ జిల్లా కోడా బ్లాక్లోని NH-31పై ఘటన
బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా
మృతులు పూర్నియా నివాసితులుగా గుర్తింపు
Bus… pic.twitter.com/kplY19s78a
— BIG TV Breaking News (@bigtvtelugu) April 12, 2026