E-Paper
Advertisement

Gold worth Rs. 12 Crore Seized: భారీగా బంగారం పట్టివేత.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు!

Gold worth Rs. 12 Crore Seized: భారీగా బంగారం పట్టివేత.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు!
Advertisement

BSF Foils Smuggling bid: సరిహద్దు భద్రతా బలగాలు ఆదివారం భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 12 కోట్లు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ లోని భారతదేశం – బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దులో భారీ బంగారు స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భద్రతా బలగాలు(బీఎస్ఎఫ్) విఫలం చేశాయి. రూ. 12 కోట్లు విలువ చేసే 16.07 కిలోల బరువున్న 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని పరగణాల జిల్లాలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని హల్దర్ పద సరిహద్దు గ్రామంలో ఓ అనుమానాస్పద ఇంటిని అన్ని వైపుల చుట్టుముట్టారు భద్రతా బలగాలు. ఇంటిని చుట్టుముట్టిన తరువాత బీఎస్ఎఫ్ అధికారులు, గ్రామంలోని ఇతర నివాసితుల సమక్షంలో ఆ ఇంటిని శోధించారు. ఈ తనిఖీల్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: ఏంటి.. జూన్ 14 తర్వాత నుంచి ఆధార్ పనిచేయదా.. నిజమెంత ?

అయితే, ఇంతకుముందు కూడా ఇలాగే సరిహద్దు భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించి బంగారం స్మగ్లింగ్ బిడ్ ను విఫలం చేసి రూ. 6.7 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10.73 కిలోల బరువున్న 16 బంగారు కడ్డీలు, నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×