BigTV English

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Mahabub Nagar: మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన కారు.. దాని కిందికి చొచ్చుకుని వెళ్లింది.


Also Read: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

ప్రమాదంలో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా తిరుపతి నుంచి కర్నూల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. మధ్యలో బైక్ ను తప్పించబోయి డీసీఎంను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×