E-Paper
Advertisement

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Mahabub Nagar: మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన కారు.. దాని కిందికి చొచ్చుకుని వెళ్లింది.

Also Read: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

ప్రమాదంలో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా తిరుపతి నుంచి కర్నూల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. మధ్యలో బైక్ ను తప్పించబోయి డీసీఎంను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×