Diesel Theft: స్వేచ్చ బ్యూరో: జోగిపేట పట్టణంలో సోమవారం అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ డీజిల్ దొంగతనాలకు పాల్పడింది. పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆవరణలోని సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చిన నలుపు రంగు కారు ముందుకు వెళ్లి వెనక్కి మలుపుకొని వచ్చి ఆక్స్ఫర్డ్ పాఠశాల గోడకు దగ్గరగా నిలుపుకున్నారు. అందులో నుంచి ముగ్గురు యువకులు బయటకు దిగారు. వారంతా చడ్డీలు ధరించి ఉన్నారు. పాఠశాలలోని ప్రహరిగోడను దూకి పాఠశాలకు చెందిన బస్సుల్లో నుంచి సుమారుగా 50 లీటర్ల డీజిల్ను దొంగిలించారు.
Also Read: బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!
అదే రోజున లారీలో నుంచి 100 లీటర్ల వరకు గుర్తు తెలియని దొంగలు డీజిల్ను దొంగిలించారు. పాఠశాల వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనంపై పాఠశాల యాజమాన్యం మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కారుకు ఉన్న నంబరును పరిశీలించగా అది ఒక ఆటోదిగా గుర్తించారు. ఈ విషయమై పోలీసులు నిందితుల కోసం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు చడ్డీలపై వచ్చే దొంగలు ఇళ్ళల్లో దొంగతనాలు చేయడమే విన్నాం. కానీ వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనాలకు సైతం ఎగబడ్డారని తెలుస్తుంది.
Also read: గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్లో తొలగింపుపై ఉత్కంఠ!