E-Paper
Advertisement

బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!

బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!
Advertisement

Ponnam Prabhakar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుకు సంబంధించి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై ఆయన తాజాగా మరోసారి స్పందిస్తూ, తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని, బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు. బాధితురాలు కూడా తమ సామాజిక వర్గానికి (మున్నూరు కాపు) చెందిన వ్యక్తేనని, ఈ విషయంలో ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఆయన వివరించారు.

మున్నూరు కాపు సంఘాల విమర్శలకు సమాధానమిస్తూ.. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాను సూచించిన మాట నిజమేనని, అయితే అది బాధితురాలికి అన్యాయం చేసే విధంగా కాదని ఆయన పేర్కొన్నారు. ‘మీరు ఏం చేస్తారు?’ అనే అర్థంలో తాను వాడిన కొన్ని పదాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కానీ తన అంతిమ లక్ష్యం బాధితురాలికి అండగా నిలబడటమేనని చెప్పారు. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబానికి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాలని, అందులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, చట్టపరంగా ఆమెకు దక్కాల్సిన న్యాయం కోసం తాము పోరాడతామని పునరుద్ఘాటించారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయంపై స్పందించడం తన బాధ్యతని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also read: నీట్ లీకేజీ మిస్టరీ.. ప్రింటింగ్ ప్రెస్ లోనే అసలు కథ మారిందా?

Advertisement

Related News

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసి రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Bike Theft Gang: షామీర్‌పేటలో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. ఎక్కడ దాచారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

Govt Hospital Scans: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత స్కానింగ్ మాయం.. పైసలిస్తేనే టెస్టులు!

ఆమె లేని లోకంలో ఉండలేనంటూ.. ప్రియురాలు చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రియుడు సైతం..

Big Stories

Advertisement
×