E-Paper
Advertisement

సంతోషంగా చనిపోతున్నాం.. దంపతులు ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు

సంతోషంగా చనిపోతున్నాం.. దంపతులు ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు
Advertisement

Couple Suicide: దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తమ కొడుకు లేని ఈ లోకంలో ఉండలేమంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో వెలుగుచూసింది. ఈ హృదయ విదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగింది?

ఛత్తీస్‌గఢ్‌‌లో దారుణం.. దంపతుల ఆత్మహత్య

Advertisement

జంజ్‌గిర్-చంపా జిల్లాలోని దర్దేయి ప్రాంతానికి చెందినవారు కృష్ణ పటేల్-రమాబాయి పటేల్ దంపతులు. వృత్తిరీత్యా తాపీ మేస్త్రి కృష్ణ కాగా, రమాబాయి గృహిణిగా ఉండేది. వారి ప్రపంచం కొడుకు ఆదిత్య. ఈ జంటకు 21 ఏళ్ల ఆదిత్య పటేల్ ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

రెండేళ్ల కిందట అంటే 2024లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆదిత్య ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆనాటి నుంచి దంపతులు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. కొడుకు మరణం తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా మారింది. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు వేస్తే నిత్యం కొడుకు గుర్తుకు వచ్చేవాడు. దాన్ని నుంచి ఈ దంపతులు బయటపడలేకపోయారు.

Advertisement

సూసైడ్ లేఖలో కీలక విషయాలు.. కొడుకు వల్లే

చివరకు ఆదివారం రాత్రి ఇంట్లోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కృష్ణ పటేల్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ క్రమంలో వారి రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌తోపాటు ఓ వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మా జీవితంలో కొడుకు ఒక్కడేనని, వాడు లేని జీవితం శూన్యమంటూ రాసుంది. ఈ నేపథ్యంలో తాము కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నామని, దీనికి ఎవరూ బాధ్యులు కారని అందులో ప్రస్తావించారు. దేవుడు దయగల వాడని, ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. చివరకు నా విధి దేవునిలో విలీనం కావడమేనని రాసుకొచ్చారు.

ALSO READ: మదనపల్లిలో విషాదం.. ఏడేళ్ల బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కి

మా కోసం ఏ ఒక్కరూ దుఃఖానికి లోనుకావద్దని, తాము ఈ లోకాన్ని ఆనందంగా వదిలి వెళ్తున్నామని తెలియజేశారు. తమ కుమారుడికి రావాల్సిన పరిహారం డబ్బులు తన సోదరులకు ఇవ్వాలని వీడియోలో కోరారు కృష్ణపటేల్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే సూసైడ్ నోట్, వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×