E-Paper
Advertisement

Alluri District News: ఫోన్ చూడొద్దన్న భర్త.. గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భార్య

Alluri District News: ఫోన్ చూడొద్దన్న భర్త.. గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భార్య

Alluri District News: అసలే టెక్ యుగం.. గాడ్జెట్స్‌తో మనుషులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఒక్క క్షణం లేకుంటే ఉండలేని పరిస్థితి. ఎవరో ఒకరు ఫోన్ చేయడం, లేకుంటే రీల్స్ చేయడం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. దీనికారణంగా దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా చంపుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఘటన ఒకటి అల్లూరి జిల్లాలో వెలుగుచూసింది.

దంపతుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు

ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో భాగమైంది సెల్‌ఫోన్. అది ఒక్క క్షణం లేకుండా యువతీ యువకులు గడపలేని పరిస్థితి. చేతిలో ఫోన్ లేకుంటే ఏదో పోయినట్టు ఫీలవుతున్నారు. దంపతుల గురించి చెప్పనక్కర్లేదు. దీని విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. చాలామంది దూరమవుతున్నారు కూడా.

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అది. చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో ఊహించని ఘటన జరగింది. ఆ ప్రాతంలో రామారావు దంపతులు ఉంటున్నారు. ఆ తర్వాత ఆ దంపతుల జీవితాల్లోకి సెల్‌ఫోన్ ఎంటరైంది. బంధువులు ఫోన్ చేయడం, లేకుంటే వీలు చిక్కినప్పుడల్లా ఫోటోలు చూడడం, లేకుంటే రీల్స్ చేయడం కామన్‌గా మారిపోయింది.

మందలించినట్టు భర్తను గొడ్డలితో నరికిన భార్య

ఇదే వారి మధ్య గొడవలకు కారణమైంది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని భార్యపై ఆగ్రహించాడు భర్త. ఇంట్లో ఉండి ఫోన్ ఉపయోగిస్తే ఎలా అలా సీరియస్ అవుతున్నారని భావించింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

పట్టరాని కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తపై పలుమార్లు దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డాడు, స్పాట్‌లో పడిపోయాడు భర్త రామారావు. ఆయన అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే చింతపల్లి నుంచి విశాఖ కేజీహెచ్‌కి రామారావుని తరలించారు.

ALSO READ: మీర్ పేట్‌లో ఘోరం.. పల్టీలు కొట్టిన కారు, స్పాట్‌లో ఐదుగురు

క్షతగాత్రుడు చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించాడు. కట్టుకున్న భర్త తన కళ్ల ముందు మృతి చెందడాన్ని నిందితురాలు తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశానంటూ కన్నీరుమున్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చింతపల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×