E-Paper
Advertisement

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

Delhi Crime: ఢిల్లీ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దేవోస్మిత పాల్‌ శివాజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త బెంగళూరులో ఉంటుండగా, ఆమె ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్నారు. ఫ్లాట్‌ బయట తాళం వేసి ఉంది. ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మృతురాలి సోదరి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది.

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి

పోలీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలోని శివాజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు దేవోస్మిత పాల్‌. అయితే ఆమె భర్త బెంగళూరులో ఉంటున్నారు. ఆమె తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. గురువారం ఉదయం ఫ్లాట్‌‌కు బయట తాళం వేసి ఉంది.

ఏదో పని నిమిత్తం పాల్‌ సోదరి ఫోన్‌ చేసింది. తన చెల్లెలు నుంచి ఎలాంటి స్పందన లేదు.దీంతో అనుమానం వచ్చి సోదరి దేవరి ఫ్లాట్‌ తాళం పగలకొట్టి లోపలికి వెళ్లి చూసింది. అప్పటికే తన చెల్లెలు విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తలపై బలంగా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

ఆమెని చంపిందెవరు? ఇంట్లో బంగారం, నగదు మాటేంటి?

ఆ ప్లాట్‌‌లో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోని బంగారం, నగదు అలాగే ఉన్నాయని, దోపిడీ జరిగిన ఆనవాళ్లు లేవంటున్నారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన రహస్యాలలో ఒకటి.

బాధితురాలి మృతదేహం లోపల ఉండగా, అపార్ట్‌మెంట్‌కు బయటి నుండి ఎలా తాళం వేసిందెవరు? నివాసంలోకి ఎవరైనా బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్ల ఆధారాల కోసం పరిశీలన చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. ప్రొఫెసర్ మ‌రణానికి దారి తీసినదానికి సంబంధించి  సాధ్యమయిన ప్రతి ఆధారాన్ని పరిశీలన చేస్తున్నారు.

ALSO READ: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

Big Stories

×