Children Missing: నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతైన సంఘటన కలకలం రేపింది. సరదాగా ఈతకు వెల్లిన నలుగురు చిన్నారులు నీటి గుంతలో పడి గల్లంతయ్యారు. పిల్లల చావును ఓర్చేకోలేని తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటుచేసుకుంది.
ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి గ్రామ శివార్లలోని నీటి కుంటలోకి ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది. గట్టు పై పిల్లల బట్టలు, చెప్పులు లభ్యమవడంతో స్థానికులు అది గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. గల్లంతైన పిల్లను గుర్తించేందుకు ప్రస్తుతం గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also read: సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?
గాలింపు చర్యల్లో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో మిగతా చిన్నారులకోసం గజ ఈత గాల్లు గాలింపు చర్యలు చేట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఓక్క సారిగా విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లల మరణం తట్టుకోలేక ఆ తల్లి తండ్రులు పడుతున్న వేదన చూస్తే అక్కడి వారంతా ఓక్కసారిగా పుట్టెడు శొకంతో కనిపించారు. దీంతో పరిసర ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంకేదైనా కారణం ఉందా అనే కొణంలో విచారిస్తున్నారు.
నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు
ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటుచేసుకుంది.
గ్రామ శివార్లలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
గట్టుపై పిల్లల బట్టలు, చెప్పులు లభ్యమవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం గజఈతగాళ్ల… pic.twitter.com/rE00jFrhin
— BIG TV Breaking News (@bigtvtelugu) June 4, 2026
Also Read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు