E-Paper
Advertisement

Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!

Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!

Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. మాదాపూర్‌లోని గూగుల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారు నడుపుతూ, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేశారు. అంతటితో ఆగకుండా.. బస్సుకు అడ్డంగా కారును నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.

ఈ గొడవ కాస్తా ముదిరి, యువకులు బస్సు డ్రైవర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. పట్టపగలే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు చూస్తుండగానే.. యువకులు ఆవేశంతో బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో వారు చేస్తున్న రచ్చను ఆపడానికి ప్రయత్నించిన వారిని కూడా యువకులు దుర్భాషలాడినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని, విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read: పర్యాటకులకు బంపర్ ఆఫర్.. ఇకపై వాట్సాప్‌లోనే టూర్ టికెట్స్.. ఎలాగో తెలుసా?

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×