BigTV English

East Godavari Crime: తూర్పులో దారుణం, మహిళను రేప్ చేసి, ఆపై దారుణంగా..

East Godavari Crime: తూర్పులో దారుణం, మహిళను రేప్ చేసి, ఆపై దారుణంగా..

East Godavari Crime: కామాంధులు, గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. మత్తులో ఎవరినీ వదల్లేదు. ఆడపిల్ల, మహిళ కనిపిస్తే చాలు, కళ్లు కామంతో మూసుకు పోతున్నాయి. లేటెస్ట్‌గా తూర్పుగోదావరి కడియం నర్సరీలో దారుణం చోటు చేసుకుంది.


అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.. ఒడిషాలోని పర్లాకిమిడికి చెందిన 43 ఏళ్ల మహిళ ఫ్యామిలీ కూలి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంక ప్రాంతానికి కూలి పనుల నిమిత్తం వచ్చింది. నర్సరీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు.

అక్టోబర్ 15న కూలి పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరింది. బుర్రిలంకకు చెందిన నలుగురు యువకులు ఆమెని అడ్డగించి తమ కోరిక తీర్చమని బలవంతం చేశారు. బాధితురాలు ప్రతిఘటించడంతో చెట్ల వద్దకు తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.


ఈ ఘటన అదే రోజు రాత్రి 9 గంటలకు జరిగినట్టు తేలింది. ఆ తర్వాత ఆమెని చంపేసి గోదావరి సమీపంలోని పంట కాలువలో పడేశారు. అక్టోబర్ 16న మహిళ మిస్సింగ్ అయ్యిందంటూ కడియం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

ALSO READ: గంజాయి స్మగ్లింగ్.. పోలీసులే సూత్రధారులు.. తలలు పట్టుకున్న ఉన్నతాధికారులు

ఘటన జరిగి రెండు రోజుల తర్వాత గోదావరి కాలువలో మహిళ మృత దేహాన్ని గుర్తించారు. మృతురాలు పని చేసిన నర్సరీ వద్ద ఆమె నల్లపూసల దండ, గాజులు కనిపించాయి. ఈ వివరాలు మహిళ బంధువులు పోలీసులకు ఇచ్చారు. దీంతో కడియం మండలంలోని నర్సరీల్లో పని చేసిన మహిళల గురించి ఆరా తీశారు.

ఘటన తర్వాత నర్సరీలో పనులకు హాజరుకాని వారిపై ఆరా తీశారు. అందులో ఓ వ్యక్తి రాలేదని గుర్తించారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసు. వాడ్ని పట్టుకుని తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇచ్చిన ఆధారాలతో మిగతా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరంతా గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు పోలీసులకు వివరించారు. ఘటన తర్వాత మహిళను హత్య చేశారా? అప్పటికే ఆమె మృతి చెందిందా? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తేలనుంది. తల్లి ఫోటోను పట్టుకుని కొడుకు, కూతురు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×