Ganja Seizure: ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో.. రైల్వే పోలీసులు , స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్లో రైలు ఆగగానే పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి.
నిందితుల నుంచి సుమారు 13 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ ముఠా ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ లాభం కోసం చెన్నైకు తరలిస్తున్నట్లు తేలింది. రైలు ప్రయాణికులకు ఎలాంటి అనుమానం రాకుండా బ్యాగుల్లో ప్యాక్ చేసి వీటిని రవాణా చేస్తున్నారు.
పోలీసులు నిందితులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? వీరు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా అధికారులు మరోసారి హెచ్చరించారు.
Also Read: ఏడాదికి 2 రోజులే రైలు వస్తుంది.. ఈ వింత స్టేషన్ ఎక్కడుందో తెలుసా?