E-Paper
Advertisement

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Vikarabad Explosion: భారీ అగ్నిప్రమాదం.. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలోని ఒక మెటల్ పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో పలువురు కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే కంపెనీలో ఉన్న రసాయనాలు లేదా గ్యాస్ సిలిండర్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.. షార్ట్ సర్క్యూట్ లేదా రియాక్టర్ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Also Read: కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో లక్ష్మీదేవిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు అధికారుల అధికారిక ప్రకటన తర్వాత వెల్లడి కానున్నాయి.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×