E-Paper
Advertisement

Father kills Daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. కన్నకూతురిని చంపిన ఓ కిరాతక తండ్రి

Father kills Daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. కన్నకూతురిని చంపిన ఓ కిరాతక తండ్రి

Father kills Daughter: స్వేఛ్చ బ్యూరో: ప్రజల్లో నానాటికి అధికార వ్యామోహం పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివరికి కన్న కూతురినే హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులోని కెనాల్​లో దొరికిక బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ సాయిచైతన్య వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే..

ఎడపల్లి​ మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్​ డీ 46 కెనాల్​లో ఇటీవల ఓ బాలిక మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivas)​ ఆధ్వర్యంలో మూడు టీంలు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. బాలికను మహారాష్ట్రలోని ముఖేడ్​కు చెందిన ప్రాచి కొండమంగలేగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను కన్న తండ్రే హతమార్చినట్లు గుర్తించారు. ముఖేడ్​ తాలూకాలోని కెరుర్​ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ భార్య ముగ్గురు పిల్లలతో ముఖేడ్​లో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్ సర్పంచ్​గా పోటీ చేయాలనే భావించాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉండడంతో పోటీకి అనర్హుడిని అవుతానని అనుకున్నాడు. దీంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్​తో కలిసి పథకం వేశారు. ముగ్గురు పిల్లల్లో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు.

Also Read: Tata Motors Sales: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?

ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి..

కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికెట్ ఉందని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పుణె కార్పొరేషన్ ఆఫీసు వెళ్లి బర్త్ సర్టిఫికెట్​ మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికెట్​ మారదని తెలిసిన తరువాత.. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచీని అతని తండ్రి తన బైక్​పై ఎక్కించుకుని వచ్చి నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి​ మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్​ డీ 46 కెనాల్​లో బాలికను తోసేశాడు. దీంతో చిన్నారి మృతి చెందింది. కేసును చాకచక్యంగా ఛేదించిన బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు, ఎస్సైలు రమ, చంద్రమోహన్​, ఏఎస్సై బాబురావు, కానిస్టేబుళ్లు సుధీర్​, శ్రీకాంత్​లను సీపీ అభినందించారు.

Also Read: Apple Valentine’s Day Offers: వాలెంటైన్స్ డే అదిరిపోయే ఆఫర్స్.. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్‌పై వేలల్లో డిస్కౌంట్లు!

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×