E-Paper
Advertisement

sabarimala: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్‌లో మహిళ మృతి..!

sabarimala: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్‌లో మహిళ మృతి..!
Advertisement

sabarimala: కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం వరకు విపరీతమైన రద్దీతో.. చాలామంది బారికేడ్లను సైతం ఎక్కారు. భక్తుల రద్దీ విషయంలో.. ఆలయ బోర్డు, ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు.

రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదంటూ.. ఆలయ అధికారులపై మండిపడుతున్న భక్తులు..
ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉండటంతో.. రద్దీ నియంత్రణ భారంగా మారింది. పోలీస్ బందోబస్తు పెద్దగా లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో.. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డారు. అలా నిల్చున్నప్పుడు కనీసం నీళ్లు కూడా అందలేదని విమర్శలు వస్తున్నాయి.

Advertisement

క్యూలైన్‌లో కిందపడి మరణించిన భక్తురాలు..
క్యూలైన్‌లో భారీ రద్దీతో తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళ క్యూలో కిందపడి మరణించింది. మృతురాలు కోజికోడ్ జిల్లా కోయిలాండికు చెందిన భక్తురాలిగా గుర్తించారు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్‌ను ఢీ కొన్న బస్‌.. స్పాట్‌లో 40 మంది

Advertisement

ఈనెల 24 వరకు రోజుకు 75 వేల మందికే దర్శనం..
అయ్యప్పస్వామి దర్శనానికి ఈ నెల 24వరకు.. రోజుకు 75వేల మంది భక్తుల్నే అనుమతించనున్నారు. ప్రస్తుతం శబరిమలకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వర్చువల్‌ క్యూలైన్‌ ద్వారా 70వేల మందిని.. స్పాట్‌ బుకింగ్‌ ద్వారా 5వేల మందినే దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా బుక్‌ చేసుకున్న తేదీల్లోనే భక్తులు దర్శనానికి రావాలన్నారు SP ఆనంద్.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×