BigTV English
Advertisement

Suryapet Accident: సూర్యాపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు – నలుగురు దుర్మరణం

Suryapet Accident: సూర్యాపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు – నలుగురు దుర్మరణం

సూర్యాపేట, స్వేచ్ఛ : రాష్ర్టంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మ‌ృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్నఇసుక లారీని, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు తీసువస్తోంది. ఈ క్రమంలో ఐలాపురం వద్ద తెల్లవారు జామున రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని, బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మందికి గాయలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 32 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రవి ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.


మరో ఘటనలో..
లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. సోంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26), అతడి స్నేహితుడు నాగరాజు (25) కొంపల్లి వెళ్లి వన్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకు వద్దకు రాగానే హైదరాబాద్ మెదక్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అల్లీపూర్ గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గాప్రసాద్‌కు భార్య సారిక, ఓ కూతురు, నాగరాజుకు భార్య మేఘమాలతో పాటు ఓ కూతురు ఉంది. మృతదేహాలను నర్సాపూర్ పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామనికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: ప్రేమ వివాహం చేసుకున్న జంట.. 20 ఏళ్ల తర్వాత కోడలిని చంపేసిన అత్తామామలు..


Related News

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Big Stories

×