E-Paper
Advertisement

Kamareddy News: ఉగాది వేళ తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

Kamareddy News: ఉగాది వేళ తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

Kamareddy News: ఉగాది రోజు కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలోని ఓ చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఆదివారం ఉదయం చెరువు దగ్గరకు మౌనికతోపాటు వారి ముగ్గురు వెళ్లారు. అయితే మౌనిక బట్టులు ఉతుకుతోంది. అదే సమయంలో పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా వుండడంతో నీళ్లలో మునిగిపోగారు. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి మౌనిక నీట మునిగి మృతి చెందింది. మౌనిక వయస్సు 26 ఏళ్లు కాగా, మైతిలికి 10 ఏళ్లు, అక్షరకు ఎనిమిదేళ్లు, వినయ్‎కి ఆరేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరి ఆడకే చనిపోయారా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో వెంకటాపూర్ అగ్రహారంలో విషాదం అలముకుంది.

మరోవైపు తల్లి, ముగ్గురు పిల్లలు మృతిపై మౌనిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలన్నది బంధువుల డిమాండ్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: డేటింగ్ యాప్‌లో ప్రేమ వల.. కట్ చేస్తే ఆరుకోట్లు ఫసక్

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×