BigTV English
Advertisement

Kamareddy News: ఉగాది వేళ తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

Kamareddy News: ఉగాది వేళ తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

Kamareddy News: ఉగాది రోజు కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలోని ఓ చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


ఆదివారం ఉదయం చెరువు దగ్గరకు మౌనికతోపాటు వారి ముగ్గురు వెళ్లారు. అయితే మౌనిక బట్టులు ఉతుకుతోంది. అదే సమయంలో పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా వుండడంతో నీళ్లలో మునిగిపోగారు. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి మౌనిక నీట మునిగి మృతి చెందింది. మౌనిక వయస్సు 26 ఏళ్లు కాగా, మైతిలికి 10 ఏళ్లు, అక్షరకు ఎనిమిదేళ్లు, వినయ్‎కి ఆరేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. నలుగురు నీళ్లలో మునిగి ఊపిరి ఆడకే చనిపోయారా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో వెంకటాపూర్ అగ్రహారంలో విషాదం అలముకుంది.


మరోవైపు తల్లి, ముగ్గురు పిల్లలు మృతిపై మౌనిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలన్నది బంధువుల డిమాండ్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: డేటింగ్ యాప్‌లో ప్రేమ వల.. కట్ చేస్తే ఆరుకోట్లు ఫసక్

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×