Gachibowli: హైదరాబాద్ ఐటీ హబ్లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్లో ప్రియుడి వేధింపులు తాళలేక 23 ఏళ్ల యువతి ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. నానక్రామ్గూడలో ఉద్యోగం చేస్తున్న ఆ యువతి, సాయికుమార్ అనే వ్యక్తితో కలిసి కొంతకాలంగా ఇక్కడ సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్) సాగిస్తోంది.
అయితే, సాయికుమార్ ఆమెపై తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. తరచూ మద్యం తాగి వచ్చి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి బిల్డింగ్ పైనుంచి దూకేసింది.
ఈ ఘటనకు ముందు వారిద్దరూ కలిసి బిల్డింగ్ పైకి వెళ్లినట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సాయికుమార్ ఒక్కడే వెనక్కి రావడం, ఆ వెంటనే యువతి కిందపడిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వేధింపులే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: పటాన్చెరులో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయం.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోలివింగ్ హాస్టల్లో ఘటన
సాయికుమార్ అనే వ్యక్తితో కోలివింగ్లో ఉంటున్న యువతి
యువతిపై అనుమానంతో వేధించిన సాయి కుమార్
వేధింపులు తాళలేక బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య
ఆత్మహత్యకు ముందు బిల్డింగ్పై సాయికుమార్తో… pic.twitter.com/RpalTITQCx
— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2026