BigTV English

Gang rape in Eluru District: ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

Gang rape in Eluru District: ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

Gang rape in Eluru District: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటన మరువక ముందే మరో మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ భర్తతో కలిసి మద్యం తాగిన ముగ్గురు యువకులు..భర్తను చితక్కొట్టి, అతని భార్యను కొంతదూరం ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.


భర్తతో కలిసి రాత్రి మద్యం తాగిన ముగ్గురు యువకులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే భార్యభర్తలు నిద్రిస్తున్న సమయంలో ఆ ముగ్గురు యువకులు భార్యను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె కేకలు వేయడంతో భర్తకు లేచి అడ్డుకునేందుక ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఆయన కాళ్లపై విచక్షణా రహితంగా కొట్టి..వివాహితను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చెందిన ఇద్దరు దంపతులు ఇటీవల ఏలూరు పట్టణానికి వచ్చారు. వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటూ ఉదయం హోటల్‌లో పనిచేస్తున్నారు. రాత్రి రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై నిద్రిస్తున్నారు. అయితే జీతం వచ్చిన తర్వాత అద్దె ఇళ్లుకు మారాలని అనుకున్న వీళ్లకు ఓ ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వారం రోజులుగా అక్కడే ఉంటున్న వీరితో నగరానికి చెందిన ముగ్గురు యువకులు స్నేహంగా ఉంటున్నారు.


శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు, విజయరాయికి చెందిన వ్యక్తికి మద్యం తాగించారు. అతను మద్యం మత్తులో నిద్రపోయిన వెంటనే ఆ పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య(35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె వద్దని చెప్పినప్పటికీ ఆ ముగ్గురు బలవంతం చేశారు. దీంతో ఆమె కేకలు వేసింది. భర్తకు మెలకువ వచ్చి అడ్డగించేందుకు ప్రయత్నించగా.. ఆ యువకులు ఓ కర్రతో కాళ్లపై బలంగా కొట్టడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. అనంతరం ఆ మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆమె ముఖంపై దాడి చేశారు.

బాధితురాలి భర్త పాకుకుంటూ రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఈ సమయంలో సెకెండ్ షో సినిమా చేసి వస్తున్న ఓ యువకుడు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదని ఆ యువకుడు చెబుతున్నాడు. అయితే భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏలూరులోని లంబాడీ పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని కోర్టు లో హాజరుపర్చగా.. 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

 

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×