E-Paper
Advertisement

Girl Kills Own Brother: ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!

Girl Kills Own Brother: ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!
Advertisement

Girl Kills Brother Over dispute about Phone Calls: స్మార్ట్ ఫోన్ ను అవసరానికి మించి వాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఫోన్ తో పనిలేకున్నా.. దానికే అంటుకుపోయి ఉంటున్నారు. గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడటం, సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫోన్ల మోజులో పడి మనుషుల విలువ తెలుసుకోవడం లేదు. అబ్బాయిలతో మొబైల్ ఫోన్ లో మాట్లాడిన బాలికను మందలించినందుకు.. తన అన్ననే అంతమొందించింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని ఖైరాఘర్ – చుయిఖదాన్-గండాయ్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుయిఖదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్లిదిహ్కల గ్రామంలో.. బాలిక తరచూ ఫోన్ లో అబ్బాయిలతో మాట్లాడటాన్ని తన అన్నయ్య గ్రహించాడు. ఫోన్ లో ఎక్కువ మాట్లాడొద్దని మందలించాడు. దాంతో.. కోపానికి గురైన యువతి అతను నిద్రిస్తుండగా గొడ్డలితో అతని గొంతుపై వేటు వేసింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Also Read: నర్సు కాదు ఓ కిల్లర్.. 700 ఏళ్ల జైలు

అనంతరం బాలిక స్నానం చేసి.. తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి, తన సోదరుడు హత్యకు గురయ్యాడని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులను విచారించగా ఆ సమయంలో తాము బయట ఉన్నామని తెలిపారు. బాలిక ప్రవర్తనను అనుమానించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. తానే హత్యచేసినట్లు అంగీకరించింది. బాలికపై కేసు నమోదు చేసి.. జువైనల్ హోమ్ కు తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×