E-Paper
Advertisement

Crime News: పహాడీ షరీఫ్‌లో అమానుషం, ప్లాస్టిక్ కార్ఖానాలో బాలికపై అత్యాచారం

Crime News: పహాడీ షరీఫ్‌లో అమానుషం, ప్లాస్టిక్ కార్ఖానాలో బాలికపై అత్యాచారం

Hyderabad News: హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిందితులు బాలిక కిడ్నాప్‌కు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ఈ నెల 12న బాధిత బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు మరుసటి రోజు, 13న పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా.. బాలికను జల్‌పల్లి ప్రాంతంలోని ఒక ప్లాస్టిక్ కార్ఖానాలో బంధించినట్లు.. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ దారుణానికి పాల్పడింది ఒక మైనర్ బాలుడు అని నిర్ధారించారు. అతడికి ఈ నేరంలో మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు.

Also Read: విషాదం.. రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..

బాధితురాలి ఫిర్యాదు, దర్యాప్తు వివరాల ఆధారంగా.. పహాడీ షరీఫ్ పోలీసులు తక్షణమే స్పందించి, మైనర్ బాలుడు సహా మొత్తం ముగ్గురిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక సాక్ష్యం.. అయిన వైద్య పరీక్షల నిమిత్తం బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×