Hyderabad News: హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిందితులు బాలిక కిడ్నాప్కు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ఈ నెల 12న బాధిత బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు మరుసటి రోజు, 13న పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా.. బాలికను జల్పల్లి ప్రాంతంలోని ఒక ప్లాస్టిక్ కార్ఖానాలో బంధించినట్లు.. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ దారుణానికి పాల్పడింది ఒక మైనర్ బాలుడు అని నిర్ధారించారు. అతడికి ఈ నేరంలో మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు.
Also Read: విషాదం.. రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..
బాధితురాలి ఫిర్యాదు, దర్యాప్తు వివరాల ఆధారంగా.. పహాడీ షరీఫ్ పోలీసులు తక్షణమే స్పందించి, మైనర్ బాలుడు సహా మొత్తం ముగ్గురిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక సాక్ష్యం.. అయిన వైద్య పరీక్షల నిమిత్తం బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.