E-Paper
Advertisement

Gold Shop Robbery: పట్టపగలు బంగారం షాపు దోపిడీ.. యజమానిపై దాడి, 3 లక్షల నగలు దోచేశారు

Gold Shop Robbery: పట్టపగలు బంగారం షాపు దోపిడీ.. యజమానిపై దాడి, 3 లక్షల నగలు దోచేశారు
Advertisement

Gold Shop Robbery: మార్కెట్లో గోల్డ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కడా బ్రేక్ పడిన సందర్భం కనిపించలేదు. రాను రాను ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన, అంతరాష్ట్ర దొంగల ముఠాల చూపు బంగారం షాపులపై పడింది. పట్టపగలు షాపులను దోచేస్తున్నారు.  తాజాగా అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది.

పెరుగుతున్న బంగారం షాపుల దోపిడీలు

Advertisement

బంగారం ధరలు సామాన్యుడి అందుబాటులోకి రాలేదు. రోజు రోజుకూ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు ధర పెరగడానికి కారణమైంది. దీంతో కొనుగోలు తగ్గినా, ధర మాత్రం దిగిరానంటోంది. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన నేరగాళ్లు చూపు బంగారంపై పడింది. ఈ మధ్యకాలంలో బంగారు షాపులను టార్గెట్ చేస్తున్నారు.

ముంబై శివారులోని ఘట్కోపర్‌ ప్రాంతంతో బంగారం షాపు దోపిడీకి గురైంది. ఈ ఘటనలో దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించారు. కాసేపు షాపు యజమానితో మాట్లాడారు.  లోపల నగలను బయటకు తీశాడు. ఈలోగా ఒకడు యజమానిపై దాడి చేశాడు.  వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కత్తితో ఓనర్‌ని గాయపరిచాడు. అంతలో మరొకడు ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ముంబైలో పట్టపగలు బంగారం షాపు దోపిడీ

బాక్సుతో బయటపెట్టిన బంగారు ఆభరణాలను వారు తీసుకొచ్చిన సంచిలో సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దోచుకెళ్లిన ఆభరణాల విలువ అక్షరాలా 3 లక్షలు ఉంటుందని షాపు యజమాని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే కాసేపటికి తేరుకున్నాడు షాపు ఓనర్. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు.

షాపుకు ఇరువైపులా ఉన్న ఫుటేజ్ ని చెక్ చేశారు. చివరకు ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆ ప్రాంతం పోలీసులు తెలిపారు. ఇది ముమ్మాటికీ దోపిడీ అని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జోన్-7 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.  ఓనర్ షాపు ఓపెన్ చేయగానే ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు తెలిపారు.

ALSO READ: వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-బైక్‌ని ఢీ కొట్టిన మరో ఆటో

ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దొంగలు షాపులోకి ఎంట్రీ ఇచ్చి బంగారం దోచేశారు. ఆ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఈ మధ్యకాలంలో బంగారం షాపులు దోపిడీకి గురికావడంతో జ్యువెలర్స్ అసోసియేషన్ రియాక్ట్ అవుతోంది.  ఈ తరహా కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఇలాంటి సమయంలో దొంగల బారి నుంచి బంగారం రక్షించుకోవడానికి ఆభరణాలకు ఇన్సూరెన్స్ చేయడం ఉత్తమమని తెలిపింది. దొంగలను ఎవరూ ఆపలేరు, కాకపోతే ఆభరణాలను బీమా చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చని తెలియజేసింది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×