BigTV English

Head Mistress SchoolGirl Molest : పదేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. మహిళా ప్రిన్సిపాల్‌పై కేసు

Head Mistress SchoolGirl Molest : పదేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. మహిళా ప్రిన్సిపాల్‌పై కేసు

Head Mistress School Girl Molest | ఒక స్కూల్ లో అయిదవ తరగతి చదువుకున్న బాలికపై ఒక గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే కేసులో నిందితురాలిగా స్కూల్ ప్రిన్సిపాల్ పై పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర థానె జిల్లా ముంబ్రా ప్రాంతంలోని ప్రైవేట్ స్కూల్ లో అయిదవ తరగతి జరుగుతన్న విద్యార్థిని డిసెంబర్ 3, 2024న ఉదయం స్కూల్ కు వెళ్లినప్పుడు ఆమె తరగతి గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఆ సమయంలో అక్కడికి ఒక వ్యక్తి షార్ట్స్ వేసుకొని వచ్చాడు. అక్కడ పదేళ్ల బాలిక ఒంటరిగా ఉండడంతో ఆమెను గట్టిగా పట్టుకొని బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన షార్ట్స్ విప్పేసి నగ్నావస్థలో నిలబడ్డాడు. బాలికకు తన అంగం కూడా చూపించాడు.

దీంతో బాలిక గట్టిగా అరవడంతో.. ఆమె అరుపులు విని అక్కడికి స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చింది. ఆమెను చూసి ఆ వ్యక్తి అమ్మాయిని వదిలి బయటికి వెళ్లిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మాయిని ఓదార్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ కాసేపు తరువాత అమ్మాయి తరగతి బయటికి రాగా ప్రిన్సిపాల్, ఆ గుర్తు తెలియని వ్యక్తి ఒకరితో మరొకరు మాట్లాడుతున్నారు. బాధితురాలు వారిద్దరూ మాట్లాడుకుంటుండుగా  చూసింది.


Also Read: టీనేజర్‌పై గ్యాంగ్ రేప్.. సవతి తల్లే డబ్బులు తీసుకొని..

ఇంటికి వెళ్లాక స్కూల్ లో జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు వివరించింది. ఆ వ్యక్తి ఎవరో స్కూల్ ప్రిన్స్ పాల్‌కు తెలుసునని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. స్కూల్ లోని మహిళా ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని ముందు బుకాయించింది. కానీ పోలీసులు ఆమెను ఒత్తిడి చేయగా.. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. తాను ప్రశ్నించగా.. అతను బాలిక బంధువుగా చెప్పాడని తెలిపింది.

కానీ అత్యాచారయత్నం గురించి ఆమె పోలీసులకు ఎందుకు సమాచారం అందించలేదని? ప్రశ్నించారు. దానికి ఆమె స్కూల్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉండడంతో ఫిర్యాదు చేయలేదని తెలిపింది. పోలీసులు ఆమె సమాధానాలతో సంతృప్తి చెందలేదు. పైగా నిందితుడు ఎవరో ఆమెకు తెలుసునని బహుశా ఆమె బంధువు కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఆమెను అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారం చేసిన గుర్తి తెలియని వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య
హరియాణాలోని నూహ్ జిల్లా పింగవా గ్రామంలో వారం రోజుల క్రితం సాయంత్రం 4 గంటలకు ఒక మూడేళ్ల పాప ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఒక 34 ఏళ్ల వ్యక్తి పాపను ఆడుకునేందకు తనతో తీసుకెళ్లాడు. సాయంత్రం 7 గంటలకు పాప కనిపించడం లేదని పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న గుడి స్పీకర్ ద్వారా పాప కనిపించడం లేదని ప్రకటించారు. చివరికి రాత్రి 11 గంటలకు గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో పాప శవం లభించింది. ఆమె శరీరమంతా రక్తసిక్తంగా ఉందని పోలీసులు తెలిపారు.

అయితే పాపను ఏదైనా జంతువు చంపి ఉంటుందని తొలిగా భావించి అంతక్రియలకు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ పోలీసులు పోస్ట్ మార్టం చేయాల్సిందేనని అంతక్రియలకు అంగీకరించలేదు. పోస్ట్ మార్టం నివేదికలో పాపపై అత్యాచారం చేసి ఆమెను రాళ్లతో బలంగా కొట్టి చంపారని తేలింది. దీంతో పోలీసులు గ్రామంలో ఒక 34 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. పాప శరీరంలో లభించిన వీర్యం నిందితుడి డిఎన్‌ఏ సరిపోవడంతో అతనిపై పోక్సో కేసు, హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×