E-Paper
Advertisement

Honey Trap Mastermind| మేనత్త ఇంట్లోనే దోపిడీ చేయించిన కేడి లేడీ.. గతంలో హనీట్రాప్ కూడా!

Honey Trap Mastermind| మేనత్త ఇంట్లోనే దోపిడీ చేయించిన కేడి లేడీ.. గతంలో హనీట్రాప్ కూడా!
Advertisement

Honey Trap Mastermind| ఓ మహిళ డబ్బు త్వరగా సంపాదించాలని తప్పుడ మార్గాన్ని ఎంచుకుంది. పురుషులతో సన్నిహితంగా ఉండడం.. ఆ తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేసేది. దీని కోసం ఆమెకు ఒక ప్రత్యేక గ్యాంగ్ ని మెయిన్ టెయిన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన బంధువల ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని తెలిసి.. ఆ ఇంట్లో తన గ్యాంగ్ తో దొంగతనం చేయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ లో జరిగింది.

బరేలీ సమీపంలోని నకటియా గ్రామంలో ఇటీవల ఒక రోజు రాత్రి షానవాజ్ బానో అనే మహిళ ఇంట్లో నలుగురు ముసుగు దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవారిని చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి రూ.15 లక్షలు నగదు, బంగారు నగలు దోచుకొని వెళ్లారు. అయితే దొంగతనం ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. సిసిటీవి వీడియోల ఆధారంగా రెండు రోజుల్లోనే ఆ నలుగురిని పట్టుకున్నారు. వీరిలో అర్ష్ సైఫీ ఆ ముఠాకి నాయకుడు. పోలీసులు అతడిని ఎంత ప్రశ్నించినా ? అతను నోరు విప్పలేదు. కానీ ఆ నలుగురిలో రామ్ కశ్యప్ అనే మరో దొంగ ఒక షాకింగ్ విషయం చెప్పాడు.

Advertisement

వారి ముఠాకు మరో నాయకురాలు ఉందని.. ఆమె అర్ష్ సైఫీ సోదరి ఇరమ్ సైఫీ అని. ఆ దొంగతనం ప్లాన్ అంతా ఆమెదే అని చెప్పాడు. వారం రోజుల క్రితం ఆమె అందరినీ పిలిచి.. షానవాజ్ బానో ఇంట్లో భారీ సొమ్ము ఉన్నట్లు చెప్పిందని.. దొంగతనం చేసే ముందు ఇంటి చుట్టూ రెండు రోజులు రెక్కీ కూడా చేశామని వివరించాడు. అయితే పోలీసులకు ఇరమ్ సైఫీ జాడ తెలియలేదు. అమె కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కానీ పోలీసులు బాధితురాలు షానవాజ్ బానోని దొంగతనం చేయించిన మహిళ పేరు ఇరమ్ సైఫీ అని చెప్పాగానే.. షాకింగ్ విషయం బయటపడింది.

ఇరమ్ సైఫీ మరెవరో కాదు.. షానవాజ్ బానో మేనకోడలు. అంటే మేనత్త ఇంట్లోనే ఇరమ్ దొంగతనం చేయించిందని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఒక ప్లాన్ వేశారు. షానవాజ్ బానో చేత ఇరమ్ కు ఫోన్ చేసి వెంటనే కలవడానికి రావాలని పిలిపించారు. దీంతో ఇరమ్ తన గురించి ఇంకా మేనత్తకు పూర్తిగా తెలియదని భావించి వచ్చింది. కానీ ఆమె రాగానే పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Advertisement

ఇరమ్ సైఫీ గురించి మరింత విచారణ చేయగా.. ఆమె గతంలో నగరంలోని చాలామంది ధనికులని తన వలపు వలతో ఆకర్షించి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి చేసి.. భారీగా సంపాదించిందని తేలింది. ప్రస్తుతం ఇరమ్ సైఫీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×