E-Paper
Advertisement

Jagityala Murder: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!

Jagityala Murder: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!
Advertisement

Jagityala Murder: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఏకంగా నోట్లో మట్టి కుట్టి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్ షిప్ రోజు ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన కందుల రాజశేఖర్ గౌడ్(26) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

అయితే, మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులో ఉన్న బీరయ్య ఆలయం వద్ద శవమై కనిపించాడు. దీంతో హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్నేహితుల రోజు అర్ధరాత్రి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీరప్ప ఆలయం వద్ద కాలిపోయిన శవంతో ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు..శవమై తేలడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

Advertisement

గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా యువకుడి నోట్లో మట్టి కుట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. యువకుడు అరవకుండా నోట్లో మట్టి కొట్టింటారని, చనిపోయిన తర్వాత అనుమానం రాకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పారిపోయింటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నోట్లో మట్టి కుక్కిన తర్వాత తలపై కర్రతో దాడి చేచి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే చనిపోయిన తర్వాత పెట్రోల్ పోసి అంటించారా? లేదా బతికుండగానే సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారా వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మిస్సింగ్..తిరుపతిలో ప్రత్యక్షం

Advertisement

ఇదిలా ఉండగా, స్నేహితుల రోజే యువకుడిని చంపాలని ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు ఉదయం బయటకు వెళ్లిన రాజశేఖర్ గౌడ్ కాసేపటికే ఇంటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత ఓ స్నేహితుడు వచ్చి బయటకు తీసుకెళ్లినట్లు యువకుడి తల్లిదండ్రులు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన యువకుడితోపాటు కొంతమంది మిత్రులే రాజశేఖర్ ను చంపినట్లు మృతుడి తల్లిదండ్రులు రమేష్ గౌడ్, రాధ ఆరోపిస్తున్నారు. హంతుకులను తమకు అప్పగించాలని గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×