Road Accident: జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడనవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగింది?
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ-కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్పాట్లో ఇద్దరు మృతి చెందారు. లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు హనుమకొండకు చెందిన ఇమ్రాన్, సుభాన్గా గుర్తించారు. స్నేహితుని వివాహ వేడుకకు మిర్యాలగూడకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. కారులోని ఉన్న మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
లారీ-కారు ఢీ.. స్పాట్లో ఇద్దరు మృతి, నుజ్జైన కారు ముందు పార్టు
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుల డెడ్బాడీలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న వారి నుంచి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
ఘోర ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను వరంగల్కు చెందిన ఇమ్రాన్, సుభానిగా గుర్తించారు.… pic.twitter.com/5Xua4BY0wM
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2026