E-Paper
Advertisement

Ganjayi chocolates :ఈజీగా గంజాయి చాక్లెట్లు అమ్మేస్తారక్కడ..

Ganjayi chocolates :ఈజీగా గంజాయి చాక్లెట్లు అమ్మేస్తారక్కడ..
Advertisement

Hyderabad city police caught ganjayi chocolates celler at subash nagar:  గత కొంతకాలంగా భాగ్యనగరం ఇమేజ్ కి డ్యామేజ్ కలిగిస్తున్నాయి డ్రగ్స్, గంజాయి. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా..పోలీసు నిఘా ఎంత కట్టుదిట్టం చేసినా నిత్యం ఏదో ఒక మూల గంజాయి విక్రయాలు జరుగుతునే ఉన్నాయి. పైగా ఏదో మారుమూల ప్రాంతం కాదు సిటీకి నడిబొడ్డునే కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతున్నాయి. చూపులకు ఎట్రాక్టివ్ గా ఈ గంజాయి చాక్లెట్ల రూపంలో లభ్యం కావడంతో ఎవరికీ అనుమానాలు రావడం లేదు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఒకరి ద్వారా మరొకరు తెలుసుకుని ఈ బ్రాండ్ చాక్లెట్లు అడిగి మరీ కొనుక్కుంటున్నారు. కొనుగోలు దారులు కూడా తెలివిగా వీటిని ఎవరికి పడితే వారికి అమ్మడం లేదు. వీటి పేరు చెబితేనే అమ్ముతున్నారు. అంటే ఆదో కోడ్ మాదిరిగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు యూనివర్సిటీ, పేరున్న ధనవంతుల బ్రాండ్ స్కూళ్ల వద్ద రహస్యంగా అమ్మకాలు సాగించేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా కిరాణా షాపులలోనే యథేచ్ఛగా అమ్ముస్తున్నారు ప్రబుద్ధులు. తల్లిదండ్రులు, పలువురు ఇచ్చిన కంప్లైట్స్ ఫలితంగా నెల రోజులుగా పోలీసులు కంటిమీద కునుకులేకుండా నగరమంతా గాలిస్తున్నారు.

5 ప్యాకెట్లు స్వాధీనం

Advertisement

ఈ క్రమంలో జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు అత్యంత చాకచక్యంతో నిందితులను పట్టుకున్నారు. ఈ అమ్మకాలపై పోలీసులకు కీలక సమాచారం అందాకే రైడింగ్స్ కు పాల్పడ్డారు. దాదాపు 200కు పైగా గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. షాపు యజమాని వర్కర్ పై నెట్టేసి పారపోదామనుకున్నాడు. అయితే అతని ప్రమేయం కూడా ఉన్నదని తేలడంతో షాపు యజమాని పివేష్ పాండే పై కేసు నమోదు చేశారు. ప్యాకెట్ కు 40 చొప్పున 5 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు గత 8 నెలలుగా ఎవరికీ తెలియకుండా..గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×