నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కవలలు మృతిచెందారు. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదానికి కారణం ఇదే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (AC) లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఏసీ పేలి మంటలు గది మొత్తం వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న పిల్లలు బయటకు వచ్చే లోపే దట్టమైన పొగ, మంటలు వారిని చుట్టుముట్టాయి.
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి..
స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఒక చిన్నారి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Vemulawada: వేములవాడలో దళారుల దందా.. ఏడుగురిపై కేసు నమోదు