Hyderabad Crime: హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద చోటుచేసుకుంది. నిజాంపేట ప్రాంతంలోని వర్టెక్స్ ప్రైమ్ అపార్టమెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి అర్జున్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల సమాచారం ప్రకారం.. అర్జున్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్నారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుంగా జారి పడినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు బాలుడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న కేపీఎహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతి పట్ల స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అపార్ట్మెంట్లు, నివాస సముదాయాల్లో పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ల వద్ద తగిన భద్రతా చర్యలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్ లో పడి మూడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ KPHB పీఎస్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో ఘటన
మృతి చెందిన బాలుడి పేరు అర్జున్ కుమార్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు pic.twitter.com/D0a6RD82ks
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2026